ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్: చేతులు కలిపిన శాంసంగ్, ఐబీఎం
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి తాము ఐబీఎంతో కలిసి పని చేస్తామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గురువారం వెల్లడించింది. కొత్త 5జీ, అత్యాధునిక కంప్యూటింగ్, హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్ వంటివి అందించడమే లక్ష్యంగా పని చేస్తామని, తద్వారా వ్యాపారాలు తమ కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలవని తెలిపింది. తద్వారా నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని స్వీకరించగలవని వెల్లడించింది.
గెలాక్సీ 5జీ మొబైల్ పరికరాలు, అడ్వాన్స్డ్ ఎండ్ టు ఎండ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ సొల్యూషన్ అయిన శాంసంగ్, నెట్వర్క్ మేనేజ్మెంట్, కృత్రిమ మేధ, హైబ్రిడ్ క్లౌడ్ కలిగిన ఐబీఎంతో కలిసి పని చేస్తుందని శాంసంగ్ తెలిపింది. పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఐవోటీ(IIoT) పరిష్కారాలతో మ్యానుఫ్యాక్చరర్స్ ప్రయివేటు 5జీ లేదా 4జీ నెట్ వర్క్స్, 5 మొబైల్ పరికరాలను ఎలా ఉపయోగించవచ్చునో అన్వేషించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పని చేస్తాయని తెలిపింది.
పెద్ద బ్యాంకులు సరే.. సేవింగ్స్ అకౌంట్పై ఈ బ్యాంకులు మంచి ఆఫర్
5జీ పరిష్కారాలను మెరుగ్గా అందించేందుకు ఈ రెండు సంస్థలు సహకరించుకుంటాయని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐబీఎంతో కలిసి శాంసంగ్ ఓ ప్రాజెక్టును ప్రకటించింది. శాంసంగ్, ఐబీఎం కంపెనీలు తమ తమ కార్యకలాపాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ ప్రాజెక్టులపై దశాబ్దాలుగా కలిసి పని చేస్తున్నాయి. ఇటీవల అమెరికాలో ఐబీఎం, శాంసంగ్ గ్రోత్ ఫ్యాక్టరీని రూపొందించాయి.