న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. ప్రాణాలను హరిస్తోంది. ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా రెండు వేలకు పైగా రోజువారీ మరణాలు నమోదవుతున్నాయి. మరోవంక- అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించడం, వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తుండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. నిర్మాణ, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలు సెకెండ్ వేవ్ ధాటికి కుప్పకూలిపోయే దశకు చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి- ఆక్సిజన్ కొరత దేశాన్ని చుట్టుముట్టింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలన్నీ ఖాళీ అయిపోతున్నాయి.

స్టీల్ ఫ్యాక్టరీల్లో ఆక్సిజన్ ఉత్పత్తి..
ప్రాణవాయువు అందకపోవడం వల్ల రోజూ పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల 25 మంది పేషెంట్లు చనిపోయారంటే- దాని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి స్టీల్ ఫ్యాక్టరీలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. టన్నుల కొద్దీ ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

విశాఖ, సెయిల్ సహా..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తిని రెట్టింపు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు 600 టన్నులకు పైగా ఆక్సిజన్ విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి సరఫరా అవుతోంది. తాజాగా- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న ఉక్కు తయారీ కర్మాగారాల నుంచి సగటున ప్రతి రోజూ 660 మెట్రిక్ టన్నుల మేర ఆక్సిజన్ను సరఫరా చేస్తోంది. బోకారో స్టీల్ ప్లాంట్లో ఈ నెల 21వ తేదీ నుంచి 891 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను సెయిల్ ఉత్పత్తి చేసింది.

క్యాప్టివ్ ఆక్సిజన్ ప్లాంట్లు..
భూమిలో లభించే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్, ఐరన్ ఓర్ను ఇనుముగా మార్చడానికి 2000 డిగ్రీల సెల్సియస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్ను మండించాల్సి ఉంటుంది. అప్పుడే అది కరుగుతుంది. ఈ ప్రక్రియలో ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్ను రసాయన ప్రక్రియ కోసం బ్లాస్ట్ ఫర్నేస్లోకి పంపించాల్సి ఉంటుంది. హెమటైట్ నుంచి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ పెద్ద ఎత్తున అవసరమౌతుంది. ఇంత పెద్ద ఎత్తున ఆక్సిజన్ను తయారు చేసుకోవడానికి స్టీల్ ఫ్యాక్టరీలు సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్ను నెలకొల్పుకుంటుంటాయి. క్యాప్టివ్ ఆక్సిజన్ ప్లాంట్లుగా భావిస్తారు.

ఆదుకుంటున్నవి అవే..
ఇప్పుడు ఇదే ఆక్సిజన్ దేశానికి అవసరమైంది. దీన్ని యధాతథంగా కాకుండా.. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)గా మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ఎయిర్ కంప్రెషర్ ద్వారా గాలిని తీసుకొని అందులోని మలినాలను వేరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనుపూర్తి చేసిన తరువాత.. దాన్ని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోసం ప్రత్యేక ట్యాంకర్లు అవసరమౌతాయి. దీన్ని రైల్వే మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన తయారు చేసింది. సెయిల్.. బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి రోజూ సగటున 660 టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications