Sachin: ఇండియాలో క్రికెట్ ను ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అన్నింటికన్నా BCCI ధనిక బోర్డు అంటే అతిశయోక్తి లేదు. ఈ రంగంలో మనం ఎంత చెప్తే అంత అన్నట్లు ఉంటుంది ప్రపంచ దేశాల పరస్థితి. ఈ ఆటలో ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా, సచిన్ టెండూల్కర్ స్థాయి వేరు. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థలో ఆయన వాటా కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కెప్టెన్ కూల్ MS ధోని డ్రోన్ స్టార్టప్లో పెట్టుబడులు పెట్టడం వరకు వెళ్లగా.. విరాట్ కోహ్లి తన సొంత దుస్తుల బ్రాండ్ సహా మొక్కల ఆధారిత మాంసంకు సంబంధించిన సంస్థలో వాటాలను కలిగి ఉన్నారు. వినూత్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతీయ క్రికెటర్లు డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్టార్టప్లు మరియు స్పోర్ట్స్ టీమ్ల వైపు దృష్టి సారించారు.

హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ మరియు టెక్ సొల్యూషన్స్ సంస్థ AZADలో సచిన్ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. మేక్ ఇన్ ఇండియా చొరవకు సహకారం అందించడంపై ఈ కంపెనీ దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీ, రక్షణ మరియు ఏరోస్పేస్ సహా వివిధ రంగాలలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీకి AZAD మద్దతు ఇస్తుంది.
ఇది జనరల్ ఎలక్ట్రిక్, మిత్సుబిషి, బోయింగ్ మరియు హనీవెల్ వంటి గ్లోబల్ క్లయింట్లతో పాటు టాటా, గోద్రెజ్ మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి భారతీయ సంస్థలతో కలిసి పని చేస్తోంది. 20 దేశాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్న 1,500 ప్రత్యేక భాగాల తయారీని పెంచడానికి.. సంస్థ రెండు కొత్త ప్లాంట్లను నిర్మిస్తోంది. ఈ సమయంలో క్రికెట్ లెజెండ్ నుంచి పెట్టుబడి వచ్చినట్లు వినికిడి.


Click it and Unblock the Notifications