దేశ ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేసేలా రూపాయి విలువ మళ్లీ తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వస్తున్న కస్టమ్ డ్యూటీ హెచ్చరికలతో ట్రేడ్ మార్కెట్లు ఒత్తిడిలోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రూపాయి 87.8 వద్ద ముగిసింది. ఇది ఇప్పటి వరకూ రూపాయి చేరిన చాలా తక్కువ విలువల్లో ఒకటి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో వాణిజ్య ఉద్రిక్తతలు మళ్ళీ ముదురుతున్న నేపథ్యంలో, రూపాయి విలువ మంగళవారం మరోసారి పతనమైంది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 87.8కి చేరింది. ఇది సోమవారం నమోదైన 87.66 కంటే 14 పైసలు తక్కువ. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 87.89కి కూడా పడిపోయిన రూపాయి, ఫిబ్రవరిలో నమోదైన 87.95 రికార్డ్ పతనానికి మళ్లీ దగ్గరపడింది. అయితే ఆర్బీఐ మద్దతుతో పని చేసే పబ్లిక్ బ్యాంకుల జోక్యంతో భారీ నష్టాలు కొంతవరకూ తట్టుకుని నిలబెట్టుకుంది.
ఈ రూపాయి పతనం వెనుక ఉన్న ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా హెచ్చరికలు. భారత్ రష్యా నుండి ముడి చమురు కొనుగోలుపై ఆంక్షలు పెట్టడమే కాకుండా, అన్ని భారతీయ దిగుమతులపై 25% టారిఫ్ విధించబోతున్నట్టు కూడా ప్రకటించారు. అంతేకాక, రష్యా ఆయుధాల కొనుగోలు చేసిన దేశాలకు జరిమానాల గురించి కూడా ఆయన మళ్లీ ప్రస్తావించారు.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుండగా, రూపాయి మారకం విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే, ఇది వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 308 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 24,650 వద్ద నిలిచింది. గత కొద్ది రోజులుగా విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజే వారు రూ 2,567 కోట్లు విలువైన షేర్లను విక్రయించారు.
బ్యాంకింగ్ మరియు ఆయిల్ & గ్యాస్ షేర్లు బలహీనంగా కనిపించాయి. అయితే జూలై నెలలో వాహన విక్రయాలు బాగుండటంతో ఆటో షేర్లు కొంత మద్దతు ఇచ్చాయి. ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర 1% తగ్గి బ్యారెల్కి $68కి చేరింది. ఇది OPEC దేశాలు సెప్టెంబర్ నెలలో ఉత్పత్తిని పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చోటు చేసుకుంది. దీనివల్ల రూపాయిపై కొంత భారం తగ్గినట్టే.
రూపాయి విలువ తగ్గిపోవడం కేవలం నష్టమే కాదు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, అమెరికా భారత్పై పెద్ద టారిఫ్లు పెడితే, రూపాయి బలహీనత వల్ల మన వస్తువులు డాలర్లతో పోలిస్తే చౌకగా కనిపిస్తాయి. అందువల్ల ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను పోటీగా విక్రయించగలుగుతారు.
పైన చెప్పిన కారణాలతో పాటు గత సంవత్సరం రూపాయి విలువ దాని వాస్తవ స్థాయికి మించి ఉండటంతో, ఇప్పుడు రూపాయి తగ్గడం వలన, అది ముందుగా కంటే నిజమైన విలువకు దగ్గరగా వస్తోంది.
ఇప్పటికే మార్కెట్లు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ యొక్క నాణ్యమైన విధాన నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నాయి. మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో వడ్డీ రేట్లు, లిక్విడిటీ మేనేజ్మెంట్పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఖతార్ LNG ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..

Atanu Chakraborty: అటాను చక్రవర్తి ఎవరు? HDFC బ్యాంక్ నుంచి ఆయన ఎందుకు తప్పుకున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications