హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో అమలు చేయనున్న రబీ రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.5,100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.

రూ.5,100 మంజూరు
2019-20 వార్షిక బడ్జెట్లో రైతుబంధు కోసం 12,862 కోట్లు కేటాయించారు. ఇందులో ఖరీఫ్ సీజన్లో రూ.6,862 కోట్లు మంజూరు చేయగా, రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. తాజాగా, రబీలో అందించేందుకు రూ.5,100 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ వివరాలు వచ్చాక అకౌంట్లలోకి రైతు బంధు నిధి
నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థికశాఖకు అందిస్తుంది. ఆ వివరాలు అందించిన వెంటనే ఆర్థికశాఖ ఆ నిధులను రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతుబంధు నిధిని జమ చేస్తుంది.

అలా ఐతే రూ.3500లే మిగులు
ఇదిలా ఉండగా, గత జూన్ - సెప్టెంబర్ ఖరీఫ్ సీజన్కు గాను రైతులకు మరో రూ.1,600 కోట్లు ఇవ్వవలసి ఉంది. వాటిని ముందుగా రైతుల ఖాతాలలో వేస్తే రూ.5,100 కోట్లలో రూ.3,500 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ బకాయి మొత్తాన్ని ఇప్పుడే ఇస్తారా లేక రబీకి తొలుత వేసి ఆ తర్వాత వేస్తారా తెలియాల్సి ఉంది.

నిధిని ఈ పద్ధతిలో వేస్తారా?
ఖరీఫ్ సీజన్కు గాను 10 ఎకరాల లోపు భూమి గల రైతుల అకౌంట్లలో ఎకరానికి రూ.5వేల చొప్పున జమ చేశారు. 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న వారికి ఇంకా జమ కాలేదు. ఇప్పుడు కూడా తొలుత ఎకరం, ఆ తర్వాత 2 ఎకరాలు... ఇలా పెంచుకుంటూ తక్కువ భూమి ఉన్న వారి ఖాతాలో ముందు జమ చేసే విధానంలో వ్యవసాయ శాఖ వెళ్లే అవకాశముంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications