రెండేళ్లుగా రూ.2000 నోట్ల ముద్రణ లేదు, సర్క్యులేషన్‌లో ఎన్ని ఉన్నాయంటే?

న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోట్లను ప్రింట్ చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోకసభకు తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అతిపెద్ద డినామినేషన్ ఇదే. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ సింగ్ ఠాకూర్ రాతపూర్వకంగా లోకసభకు తెలిపారు. మార్చి 30, 2018 నాటికి 3,362 మిలియన్ల రూ.2000 కరెన్సీ నోట్ల చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇది కరెన్సీ వాటాలో 3.27 శాతం కాగా, విలువ పరంగా 37.26 శాతంగా ఉన్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 26, 2021 నాటికి 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇది వ్యాల్యూమ్ పరంగా 2.01 శాతం కాగా, వ్యాల్యూపరంగా 17.78 శాతం. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్ని నోట్లు ముద్రించాలనేది ఆర్బీఐని సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల ముద్రణకు సంబంధించి ప్రింటింగ్ ప్రెస్ ఎలాంటి ఇండెంట్ వెళ్లలేదన్నారు.

 Rs 2,000 notes not printed in last two years: Government in Lok Sabha

2017-18లో కేవలం 111.507 మిలియన్ల నోట్లు ఉన్నాయని, 2018-19 నాటికి వీటిని 46.690 మిలియన్ల నోట్లకు తగ్గించామని తెలిపారు. 2019 ఏప్రిల్ నుండి రూ.2000 నోట్లను ప్రింట్ చేయడం లేదని తెలిపారు. 2016 నవంబర్ 8న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తర్వాత రూ.2000 నోటును తీసుకు వచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+