GST Hike: ఇప్పటికే పెరిగిన ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలతో సతమతమౌతున్న క్రమంలో మరో సంచలనానికి కేంద్రం తెరతీయనుంది. వాహనదారులపై జీఎస్టీ భారాన్ని పెంచేందుకు పెద్ద ప్లాన్ జరుగుతోంది.
కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సెప్టెంబర్ 12న మాట్లాడుతూ డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలను నిరుత్సాహపరచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను లేఖ ద్వారా కోరారు.

డీజిల్ వాహనాలను విక్రయించటం కష్టతరంగా మార్చేందుకు అదనపు పన్నులు వేయాలని నిర్మలమ్మకు నితిన్ గడ్కరీ సూచించారు. దీనిపై ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రిని సాయంత్రం కలుస్తున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల డీజిల్ వాహనాలను విక్రయించడం కంపెనీలకు కష్టంగా మారుతుందని మంత్రి ఆటోమొబైల్ కంపెనీలను హెచ్చరించారు. డీజిల్ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని.. లేకుంటే తాను పన్నులను పెంచుతాను అని గడ్కరీ అన్నారు.
జీవ ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధనాలపై పెరుగుతున్న దృష్టిని కూడా మంత్రి నొక్కిచెప్పారు. G20 సమ్మిట్ సందర్భంగా భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో చేరినందున మార్పు అనివార్యంగా తెలుస్తోంది. అలాగే చమురు దిగుమతి ఖర్చులను తగ్గించి.. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించటానికి తాజా చర్యలు దోహదపడనున్నాయని తెలుస్తోంది. ఇథనాల్ ఆధారిత బస్సులు, ట్రక్కులను ఎందుకు నడపకూడదంటూ టో పరిశ్రమను నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఈ వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్వరాజ్ ఇంజిన్స్, అశోక్ లేలాండ్ కంపెనీల షేర్లు మార్కెట్లో నష్టాపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications