RIL Stock: నేడు అనుహ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరును కొనసాగించటం ఆసియా సంపన్నుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీకి కలిసొచ్చింది.
ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు మార్కెట్ల ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో రిలయన్స్ స్టాక్ గరిష్ఠంగా 7 శాతానికి పైగా లాభపడింది. దీంతో తొలిసారిగా 2020 సెప్టెంబర్ తర్వాత భారీగా పెరిగిన రిలయన్స్ స్టాక్ వల్ల కంపెనీ మార్కెట్ క్యాప్ సరికొత్త గరిష్ఠమైన రూ.19.5 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఒక్కరోజులోనే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.లక్ష కోట్ల మేర పెరిగింది.

రిలయన్స్ షేర్లు పెట్టుబడిదారులకు అందించిన లాభాలను పరిశీలిస్తే.. జనవరి మాసంలో ఏకంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే డిసెంబరులో 9 శాతం, నవంబరులో 4 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది రిలయన్స్ స్టాక్ స్థిరంగా వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు లాభాల ఆనందాలను పంచుతోంది. నేడు మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో ఆర్ఐఎల్ షేర్ ధరను పరిశీలిస్తే.. ఎన్ఎస్ఈలో 6.99 శాతం పెరిగి రూ.2,895 వద్ద కొనసాగుతోంది. అలాగే ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.2,904 రేటును తాకింది.
ఒకప్పుడు ప్రధానంగా చమురు వ్యాపారంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ వ్యాపారాలను విస్తరించాలని నిర్ణయించిన తర్వాత.. రిటైల్, టెలికాం, ఓటీటీ, ఫైనాన్షియల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఫ్యాషన్, జ్యూవెలరీ వంటి ఇతర అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. దీనికి తోడు రిలయన్స్ గ్రూప్ అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటితో కలిసి టెక్నాలజీ వృద్ధితో వేగంగా ముందుకు సాగుతోంది. రానున్న కాలంలో కూడా రిలయన్స్ గ్రూప్ ఇదే దూకుడును కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications