ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (నవంబర్ 2) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 125.34 పాయింట్లు(0.32%) నష్టపోయి 39,739.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31.30 పాయింట్లు(0.27%) లాభపడి 11,673.70 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం పన్నెండున్నర సమయానికి సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో ఉంది.
782 షేర్లు లాభాల్లో, 319 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 47 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ బ్యాంకు సూచీ 2 శాతానికి పైగా ఎగిసింది. నిఫ్టీ ఎనర్జీ 1 శాతం నష్టపోయింది. డాలర్ మారకంతో రూపాయి 74.29 వద్ద ట్రేడ్ అయింది. గురువారం 74.11 వద్ద క్లోజ్ కాగా, నేడు 31 పైసలు పడిపోయి 74.42 వద్ద ప్రారంభమైంది.

కుప్పకూలిన రిలయన్స్ షేర్
మధ్యాహ్నం గం.12 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, బ్రిటానియా, బీపీసీఎల్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 5 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఈ స్టాక్ ధర రూ.2000 దిగువకు వచ్చింది. మధ్యాహ్నం సమయానికి రూ.1,945 వద్ద ట్రేడ్ అయింది. గత ఐదు నెలల కాలంలో రిలయన్స్ షేర్ 5 శాతానికి పైగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఒకరోజులో అత్యంత పతనమైంది. రిలయన్స్ రెండు రోజుల క్రితం సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. లాభాలు తగ్గడంతో స్టాక్ పడిపోయింది.

రిలయన్స్కు ఫలితాల దెబ్బ
క్రితంసారి 13 మే రోజున రిలయన్స్ భారీగా పడిపోయి రూ.1950 డాలర్లు పలికింది. ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ 31 శాతం ఎగిసింది. అయితే కరోనా పరిస్థితులు, పెట్టుబడుల కారణంగా రిలయన్స్ స్టాక్ పడిలేచింది. రిలయన్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభం రూ.9,567 కోట్లుగా నమోదయింది. అయితే ఏడాది ప్రాతిపదికన 15 శాతం క్షీణించింది. జియో మినహా ఆయిల్ టు గ్యాస్ వ్యాపారంపై ప్రభావం పడింది.

ఐటీ డౌన్, రియాల్టీ జూమ్
మారుతీ సుజుకీ అక్టోబర్ సేల్స్ 19 శాతానికి పైగా ఎగిశాయి. ఇతర ఆటో కంపెనీల సేల్స్ కూడా పెరిగాయి. దీంతో ఆటో స్టాక్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
ఐటీ స్టాక్స్ నష్టపోయాయి. టీసీఎస్ 1.90 శాతం, హెచ్సీఎల్ టెక్ స్టాక్ 2.19 శాతం, ఇన్ఫోసిస్ 0.014 శాతం, విప్రో స్టాక్ 1.85 శాతం, మైండ్ ట్రీ 0.66 శాతం, కోఫోర్జ్ స్టాక్ 3.61 శాతం పడిపోయింది. కేవలం టెక్ మహీంద్ర మాత్రం 0.18 శాతం ఎగిసింది.
నిఫ్టీ బ్యాంకు 2.64 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ 1.89 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకులు 2.79 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.53 శాతం ఎగిశాయి.
అదే సమయంలో నిఫ్టీ ఆటో 0.57 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.70 శాతం, నిఫ్టీ ఫైనాన్స్ 0.27 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.28 శాతం, నిఫ్టీ ఐటీ 0.82 శాతం, నిఫ్టీ మీడియా 0.40 శాతం, నిఫ్టీ ఫార్మా 1.17 శాతం, నిఫ్టీ మెటల్ 0.37 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications