రిలయన్స్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ సేల్స్ అదుర్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చమురు రిటైల్ మార్కెట్లో సత్తా చాటుతోంది. డిసెంబర్ 31, 2019 నాటికి రిలయన్స్కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్ బంకుల్లో విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. డీజిల్ విక్రయాల్లో 11 శాతం వృద్ధిని, పెట్రోల్ సేల్స్లో 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు రిలయన్స్ తన ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం చమురు రిటైల్ పరిశ్రమ వృద్ధి రేటు డీజిల్లో 0.2 శాతం, పెట్రోల్లో 7.1 శాతంగా ఉంది. ఈ వృద్ధితో పోలిస్తే రిలయన్స్ భారీ వృద్ధి సాధించినట్లే. రిలయన్స్ పెట్రో రిటైల్ రెవెన్యూ 5 శాతం పెరిగి రూ.3,725 కోట్లకు చేరుకుంది. దాదాపు 538 మిలియిన్ లీటర్ల ఇంధనాన్ని విక్రయించింది.
సెస్-సర్చార్జ్ వద్దు, ఆదాయపు పన్నుపై గార్గ్ కీలక సూచనలు: డివిడెండ్ ట్యాక్స్ కూడా వద్దు
రిలయన్స్ చేతిలో 1,394 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఇందులో 518 సొంతగా నిర్వహిస్తోంది. మిగతా వాటిని డీలర్స్ నిర్వహిస్తున్నారు. తమ పెట్రో రిటైల్ బిజినెస్ వ్యాపారంలో 49 శాతాన్ని యూకేకు చెందిన బీపీకి రూ.7,000 కోట్లకు విక్రయించేందుకు రిలయన్స్ అంగీకరించింది. రిలయన్స్ - బీపీ జాయింట్ వెంచర్ రానున్న అయిదేళ్లలో నెట్ వర్క్ను 5,500కు పెంచుకోనున్నాయి.
నాణ్యమైన ఉత్పత్తులు, ఉన్న ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో మంచి రాబడులను సాధించామని, పెట్రోల్ కార్ల విక్రయాలు పెరగడం, రోడ్లు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానం పెరగడం వంటివి పెట్రోల్కు డిమాండ్ పెంచినట్లు రిలయన్స్ పేర్కొంది. భారీ సంఖ్యలో వాహనాలు ఉన్న కస్టమర్ల సంఖ్య పెరగడంతో వృద్ధి రేటు పెరిగిందన్నారు.