భారతదేశంలోని 28 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఇటీవల సీఎంల ఆస్తులకు సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశ ముఖ్యమంత్రులలో ఆస్తుల వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. 2024 డిసెంబర్ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది.
TIO కథనం, ADR రిపోర్ట్ ప్రకారం.. ఒక వైపు సాదాసీదా బట్టలు వేసుకుని, చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని నడుస్తూ కనిపించే మమతా బెనర్జీ దేశంలో అత్యంత పేద సీఎంగా ఉన్నారు..మరోవైపు కోట్లు విలువైన ఆస్తులు కలిగి దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా Chandrababu నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15 లక్షలు మాత్రమే. ఇందులో చేతిలో రూ. 69,000 నగదు, బ్యాంకులో రూ. 13.5 లక్షల బ్యాలెన్స్, 9 గ్రాముల బంగారు ఆభరణాలు..అవి కూడా రూ. 43 వేలు మాత్రమే ఉన్నాయని నివేదిక తెలిపింది.

ఆమె పేరు మీద ఇల్లు కాని, భూమి కాని ఏదీ లేదు.ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ, సాధారణ మధ్యతరగతి మహిళలా తన జీవితం కొనసాగిస్తున్నారని నివేదిక తెలిపింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఆస్తుల విలువ సుమారు రూ. 30.4 లక్షలుగా ఉండేది. కాని తరువాతి సంవత్సరాల్లో అది తగ్గింది. దీని వలన ఆమె సాధారణ జీవనశైలి, వ్యక్తిగత ఆస్తులపై ఆసక్తి లేకపోవడం స్పష్టమవుతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత ధనిక సీఎంగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. ఆయన ఆస్తుల విలువ అక్షరాల రూ. 931 కోట్లు అని తెలిపింది. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది. ఆయన తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 332 కోట్లు. వీరిద్దరే ఈ జాబితాలో బిలియనీర్ ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు.
మిగతా ముఖ్యమంత్రుల్లో కొందరి వద్ద కోట్ల రూపాయలు ఉండగా..మరి కొందరి వద్ద కేవలం లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి.జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వద్ద రూ. 55 లక్షల ఆస్తులు ఉండగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వద్ద రూ. 1 కోటి ఆస్తులు ఉన్నాయి. ఇక 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల మొత్తం విలువ రూ. 1,630 కోట్లు అని ADR నివేదికలో పేర్కొంది.
ADR, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ వాచ్ కోఆర్డినేటర్ ఉజ్జయిని హలీమ్ ప్రకారం..ఎన్నికల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్లు ఆదాయపు పన్ను శాఖకు పంపుతారు. కానీ వాటిపై పరిశీలన జరిగే విధానం స్పష్టంగా తెలియదు.అయినా, అఫిడవిట్లో ఇచ్చిన సమాచారం ప్రజలు నమ్మదగ్గదే అని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని, ఎన్నికల ఖర్చులు అధికమవుతున్నాయని, సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం కష్టమవుతోందని ఈ నివేదికలో హెచ్చరించారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications