rice prices: బియ్యం ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక రేట్లు ఎలా ఉంటాయంటే..

Centre on rice: బియ్యం ఎగుమతులపై కేంద్రం గతంలోనే ఆంక్షలు విధించింది. అయినా అంతకంతకూ పెరుగుతూ పోతున్న బియ్యం ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

బియ్యం రిటైల్ ధరను తక్షణమే తగ్గించాలని రైస్ ఇండస్ట్రీ అసోసియేషన్‌లను కేంద్రం ఆదేశించింది. బాస్మతీయేతర బియ్యం ధరలను సమీక్షించడానికి ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రాను రంగంలోకి దింపింది. రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ ఖరీఫ్‌లో మంచి దిగుబడి, FCIలో పుష్కలంగా నిల్వలు, ఎగుమతులపై పరిమితులు ఉన్నప్పటికీ బియ్యం ధరల పెరుగదలపై ఆందోళన వ్యక్తం చేశారు.

Rice prices to be down with central government orders

గత రెండేళ్లుగా బియ్యం వార్షిక ద్రవ్యోల్బణం దాదాపు 12 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌లో ధరలను సరైన స్థాయికి తగ్గించాలని కోరారు. ఈ ప్రయోజనాన్ని త్వరితగతిన వినియోగదారులకు అందజేయాలని సూచించారు. అదే సమయంలో లాభార్జనపై ఆచితూచి వ్యవహరించాలన్నారు. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

తగినంత స్థాయిలో నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉన్నట్లు రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమకు FCI స్పష్టం చేసింది. OMSS కింద రిజర్వ్ ధర కిలో 29 చొప్పున అందజేయగలమని వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సహేతుకమైన మార్జిన్‌తో వినియోగదారులకు విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరింది. తద్వారా రాబోయే రోజుల్లో బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+