Inflation: వరుసగా మూడోసారి దిగివచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం.. దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి క్షీణత
Inflation: దేశ ఆర్థిక పరిస్థితిపై గతంలో తీవ్ర ప్రభావం చూపిన ద్రవ్యోల్బణం ఎట్టేకలకు దారికి వచ్చింది. వరుసగా మూడోసారి కూడా RBI గరిష్ఠ పరిమితి 6 శాతం లోపే నమోదు కావడం ఉపశమనం కలిగించే వార్త అనే చెప్పాలి. తద్వారా ధరలు అదుపులోకి వచ్చి, సామాన్యులు మొదలు ప్రజలందరూ లబ్ధి పొందే అవకాశం ఏర్పడుతుంది.
ఏప్రిల్లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం ఉండగా.. మే నెలలో 20 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతానికి తగ్గింది. వినియోగదారులు సాధారణంగా ఎదుర్కొనే ఆహార పదార్థాల ధరల పెరుగుదల 2.91 శాతానికి క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గరిష్ట సహన పరిమితి 6 శాతం కంటే ఎక్కువ కాలం కొనసాగిన తర్వాత.. ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం.

రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మే 2022 నుంచి ఉన్న బేస్ ఎఫెక్ట్స్ కూడా ఈ మే లో ద్రవ్యోల్బణం రేటును తగ్గించడంలో పాత్ర పోషించాయి. అయితే నెలవారీ ప్రాతిపదికన చూస్తే ధరల స్థాయిలు స్థిరంగా కొనసాగాయి. వినియోగదారుల ధరల సూచిక (CPI) వరుసగా రెండవ నెలలో 0.51 శాతం పెరిగింది. వినియోగదారుల ఆహార ధరల సూచిక (CFPI) సైతం ఏప్రిల్లోని 0.6 శాతంతో పోల్చి చూస్తే 0.7 శాతానికి పెరిగింది.
గ్రామీణ వినియోగదారులు 4.17 శాతం, పట్టణవాసులు 4.27 శాతం చొప్పన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఆహార ద్రవ్యోల్బణం పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. నెల క్రితం 3.7 శాతం ఉండగా ఇప్పుడు 2.43 శాతానికి గణనీయంగా తగ్గింది. గ్రామీణ ఆహార ధరల పెరుగుదల నియంత్రణ తక్కువగా ఉంది. ఏప్రిల్లో 3.9 శాతం నుంచి మేలో 3.2 శాతానికి దిగివచ్చింది.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంలో కూరగాయలు మరియు నూనెలు శీతలీకరణ ద్రవ్యోల్బణానికి అత్యంత దోహదపడ్డాయి. మే 2022 స్థాయిల నుంచి ధరలు వరుసగా 16 శాతం మరియు 8.8 శాతం చొప్పున తగ్గాయి. అదే సమయంలో తృణధాన్యాలు (12.7 శాతం), పప్పుధాన్యాలు (6.6 శాతం), పాలు (8.91 శాతం) మరియు మసాలా దినుసులు (17.9 శాతం) చొప్పున ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications