RBI News: భారతీయ రిజర్వు బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డివిడెండ్ ఆదాయాన్ని పొందుతుంది. అయితే FY24లో కేంద్రం ఈ మార్గం ద్వారా అధిక ఆదాయాన్ని పొందనుందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే విదేశీ కరెన్సీ ట్రేడింగ్ ద్వారా భారతీయ రిజర్వు బ్యాంక్ గణనీయమైన లాభాలను ఆర్జించిందని తెలుస్తోంది. అయితే ఇవి పరోక్షంగా భారత ప్రభుత్వానికి మంచి రాబడిని అందించనున్నాయని తెలుస్తోంది. బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రానికి రూ.48,000 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే పెద్ద స్థాయిలో డాలర్ అమ్మకాలు, తక్కువ ప్రొనిజనింగ్ అవసరాల దృష్ట్యా అంచనాలకు మించి డివిడెండ్ చెల్లింపు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తాజా పరిస్థితులను చూస్తుంటే రిజర్వు బ్యాంక్ ఈ సారి కేంద్ర ప్రభుత్వానికి రూ.70,000 నుంచి రూ.80,000 కోట్ల మధ్య ఉండవచ్చని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, భారత ఆర్థికవేత్త గౌరా సేన్గుప్తా అంచనా వేశారు. గత సంవత్సరం సెంట్రల్ బ్యాంక్ రూ.30,307 కోట్ల మిగులును కేంద్రానికి బదిలీ చేసింది.
డివిడెండ్లపై అధిక అవుట్గో సంవత్సరంలో అధిక వడ్డీ రేట్లు కారణంగా కూడా ఉండవచ్చు. ఆర్బిఐ రివర్స్ రెపో మోడ్లో ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ తెలిపారు. బాండ్ హోల్డింగ్లపై వడ్డీ ఆదాయం మరియు లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం(LAF) కూడా గణనీయంగా ఎక్కువగా ఉండదని అంచనా. అలాగే సెంట్రల్ బ్యాంక్ లోన్స్ అండ్ అడ్వాన్సుల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంలో తీవ్ర పెరుగుదలకు దారితీయవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications