మనకు అత్యవసరంగా డబ్బు కావాల్సొస్తే వెంటనే బ్యాంకుకి వెళ్లి బంగారం తాకట్టు పెట్టి డబ్బు అవసరాన్ని తీర్చుకుంటాం. కానీ ఇక నుండి ఆలా జరగదు. ఎందుకంటే బ్యాంకులు అలాగే ఇతర నాన్ బ్యాంకింగ్ సంస్థల గోల్డ్ లోన్స్ పై ఆర్బీఐ కొరడా జూలిపించింది. దీనికి ఒక కారణం గోల్డ్ లోన్ ఇతర లోన్స్ తో పోల్చితే తక్కువ పేపర్ వర్క్ ఇంకా వేగంగా ఎక్కువ డబ్బు పొందవచ్చు. దీనికి పెద్దగా షూరిటీ కుడి అవసరం లేదు. అయితే గోల్డ్ లోన్ ప్రాసెస్ కఠినం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నిబంధనలు పాటించడం లేదని బయటపడటంతో దీనిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దేశంలో గోల్డ్ లోన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి బంగారం ధర పెరగడంతో చాలా మంది నగలు, ఆభరణాలు తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం కొన్ని కంపెనీలు గోల్డ్ లోన్ సాంక్షన్ చేయడంలో ప్రమాణాలను పాటించడం లేదని రిజర్వ్ బ్యాంక్ పసిగట్టింది. ముఖ్యంగా నిబంధనలను పాటించకుండా లోన్స్ అందించే బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాల కంపెనీలపై చర్యలు కూడా తీసుకున్నారు. గోల్డ్ లోన్స్ శాంక్షన్ చేయడంపై తాత్కాలిక నిషేధం కూడా విధించింది.
రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం గోల్డ్ లోన్ ప్రాసెస్ కఠినతరం చేయాలని యోచిస్తోందని బ్యాంకింగ్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రూల్స్ మరింత కఠినం చేయడానికి అలాగే అన్ని కంపెనీలు వాటిని ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధారణ లోన్స్ కంటే గోల్డ్ లోన్స్ సెక్టార్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దీనిని అరికట్టడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్స్ శాంక్షన్స్ చేసే ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. తాకట్టు పెడుతున్న బంగారం నిజంగా వారిదేనా, లోన్ తీసుకున్నకా వచ్చే డబ్బు దేనికి ఉపయోగిస్తారు ? లోన్ తిరిగి కట్టకపోతే బంగారం వేలం వేసే ముందు లోన్ తీసుకున్నవారికి ఖచ్చితంగా సమాచారం అందిస్తున్నారా ? కంపెనీలు ఇలాంటి వివరాలను సేకరించాలని సిఫార్సు చేసింది.

సాధారణంగా NBFCలు గోల్డ్ లోన్స్ అందించేటప్పుడు బంగారాన్ని వారే కొనుగోలు చేయాలి. కానీ లోన్ తీసుకునేవారి నుండి బంగారాన్ని సేకరించి బరువును స్వయంగా చెక్ చేసి బంగారాన్ని వాల్ల దగ్గరనే పెట్టుకుంటున్న ఫైనాన్షియల్ ఏజెంట్లు ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఇంకా ఇలాంటి మరికొన్ని లోపాలను కూడా కనిపెట్టింది. అయితే బంగారం బరువుకు అనుగుణంగా లోన్ మొత్తం లేదని, టాప్-అప్ లోన్లకు సంబంధించిన నిబంధనలు పాటించలేదని తేలింది. అందుకే వీటన్నింటినీ ఎదుర్కోవడానికి గోల్డ్ లోన్ ప్రక్రియను కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. అన్సెక్యూర్డ్ లోన్లపై కఠినమైన నిబంధనలను అమలు చేయడంలో రిజర్వ్ బ్యాంక్ విజయం సాధించింది. ఇప్పుడు, గోల్డ్ లోన్స్ పై కూడా రేగుటరీ కఠినమైన నిబంధనలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతీయులకు బంగారం అంటే ఒక ఒక్క అనుభూతి. విళ్ళు ఖచ్చితంగా ఇంట్లో చాలా బంగారాన్ని దాచిపెడతారు. అయితే, గత కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతుండడంతో, తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ పొందడానికి ప్రజలు బ్యాంకులకు బదులు బంగారం తాకట్టు పెడుతున్నారు. ఫలితంగా, గోల్డ్ లోన్స్ రుణాలు 50 శాతం పెరిగాయి. దీంతో, రిజర్వ్ బ్యాంక్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications