RBI MPC Meeting: రిజర్వు బ్యాంక్ ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించే మానిటరీ సమావేశం చివరి రోజు నేడు. ఈ క్రమంలో దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత వడ్డీ రేట్లను మార్చాలా..? వద్దా..? అనే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది.
మార్కెట్లలో అందరి నిరీక్షణకు రిజర్వు బ్యాంక్ తెరదించింది. వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ.
కీలక వడ్డీ రేటైన రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. వరుసగా ఆగస్టులో జరిగిన మూడో సమావేశంలో కూడా రేట్లలో మార్పులు లేకుండా కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ సహేతుకమైన వేగంతో వృద్ధి చెందుతూ.. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచ అభివృద్ధికి దేశ ఆర్థిక వ్యవస్థ సహకారం దాదాపు 15 శాతంగా ఉందని శక్తికాంత దాస్ అన్నారు. ఏప్రిల్ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మే 2022 నుంచి దశలవారీగా మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును రిజర్వు బ్యాంక్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6 సార్లు రేట్ల పెంపును ప్రకటించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణంపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలో రెపో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి చేరుకుంది.
ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రేట్ల పెంపును కొనసాగిస్తూ ముందుకుపోతున్న తరుణంలో భారత సెంట్రల్ బ్యాంక్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి దేశీయ ప్రజలకు ఊరటను ప్రకటించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల అధికంగా కురిసిన వానలతో వరదలు కారణంగా ఆహార ధాన్యాల ధరలను పెంచాయని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో మూడు నెలల గరిష్ఠ స్థాయి 4.81 శాతానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications