భారతదేశ గణతంత్ర దినోత్సవం జనవరి 26, దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఏడాది 2025లో భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజును దేశ రాజ్యాంగం అమలుకు ప్రతీకగా ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్, జెండా ఎగురవేత ఇంకా వివిధ రాష్ట్రాలలో వేడుకలు ఉంటాయి. ఇదే రోజున ఎర్రకోట పై దేశ ప్రధాని మొదట జండా ఎగరేస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు.
భారతదేశం 15 ఆగష్టు 1947న స్వతంత్ర దేశంగా అవతరించింది. దేశంలో దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన రోజు కూడా ఇదే. అయితే 26 జనవరి 1950 వరకు భారతదేశానికి రాజ్యాంగం లేదు. స్వతంత్రం పొందిన తరువాత 29 ఆగష్టు 1947న ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగం అధికారిక ముసాయిదా 4 నవంబర్ 1947న రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు. తరువాత రెండు సంవత్సరాలలో దానిలో వివిధ మార్పులను చేర్చి చివరకు 24 జనవరి 1950న అసెంబ్లీ ఆమోదించింది.

భారత రాజ్యాంగం లిఖించడం 26 నవంబర్ 1949న మొదలు పెట్టారు, అయితే రాజ్యాంగంని అమలు చేయడానికి జనవరి 26 ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ వెనుక కథ ఏంటి తెలుసా... 26 జనవరి 1930న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణా స్వరాజ్ని ప్రకటించింది. ఈ రోజును దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశ రాజ్యాంగాన్ని రూపొందించే పని కూడా ప్రారంభించింది. ఈ రాజ్యాంగంని 26 నవంబర్ 1949న ఆమోదించారు అలాగే 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది. జనవరి 26న రాజ్యాంగాన్ని ప్రకటించడం ద్వారా భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది పోరాటాన్ని పూర్తి చేసి కొత్త శకానికి నాంది పలికింది. ఈ రోజును ఎంచుకోవడం ద్వారా దేశం 1930 నాటి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని కూడా గుర్తు చేస్తుంది.
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత
రిపబ్లిక్ డే నాడు భారతదేశ ప్రజాస్వామ్య విలువలను జరుపుకుంటుంది. మనమందరం సమానమని, దేశ పాలనలో భాగస్వామ్యమని ఈ రోజు గుర్తుచేస్తుంది. దేశంలోని వివిధ కులాలు, మతాలు, సంస్కృతులు ఏకం కావడం ఈ రోజు గుర్తు చేస్తుంది. ఇంకా రిపబ్లిక్ డే మన రాజ్యాంగం ప్రాముఖ్యతను గుర్తు చేస్తు ఇంకా మన హక్కులు, విధులను తెలియజేస్తుంది.
రిపబ్లిక్ డే ఎలా జరుపుకుంటారు?
రిపబ్లిక్ డే రోజున దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాండ్ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో సాయుధ దళాలు, వివిధ రాష్ట్రాల నుండి దేశ చరిత్ర ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజున జాతీయ జెండాను ఎగురవేసి తుపాకులతో గౌరవ వందనం చేస్తారు. ఇంకా దేశవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications