రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఈరోజు (ఫిబ్రవరి 6) రెండవ రోజుకు చేరుకుంది. అయితే కీలక వడ్డీ రేట్లపై కమిటీ సభ్యులు చర్చించారు, దేశీయ ద్రవ్య పరిస్థితులను పరిష్కరించడానికి అలాగే రూపాయి అస్థిరతను తగ్గించడానికి తీసుకునే చర్యలతో పాటు MPC ఈ నెలలో 25 బేసిస్ పాయింట్ల కోతను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా కొత్తగా నియమితులైన RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ఇది మొదటి పాలసీ సమావేశం. డిసెంబర్ ప్రారంభంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో రాబోయే 3 సంవత్సరాలకు రిజర్వ్ బ్యాంకు 26వ గవర్నర్గా అయన బాధ్యతలు స్వీకరించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 7న జరగనున్న ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించవచ్చు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వల్ల ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని పరిగణించవచ్చని నివేదిక సూచించింది.
ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గింపు
గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం స్థాయి తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది. టమోటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ముఖ్యమైన కూరగాయల ధరలు తగ్గడం వల్ల కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) స్థిరపడింది.దింతో మెరుగైన సప్లయ్ కారణంగా ధరల అస్థిరత తగ్గింపుకు దారితీసింది, ఇది RBI వడ్డీ రేట్లను తగ్గించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఈ ప్రక్రియ దశలవారీగా జరుగుతుంది అలాగే ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ & దేశీయ అంశాల ప్రభావం
ద్రవ్య విధానంపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్బిఐ అనేక ప్రపంచ, దేశీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలి. నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో ఆర్థిక మార్కెట్లలో అస్థిరత పెరిగింది, ఇది భారత రూపాయిని ప్రభావితం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో సహా చైనా వంటి దేశాలు విధించే సుంకాల పెంపుదల, వాణిజ్య విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా డాలర్ బలపడటం భారత కరెన్సీపై ఒత్తిడి పెంచింది.
దేశీయ బ్యాంకింగ్ అండ్ ఆర్థిక పరిస్థితులు
దేశీయ ద్రవ్యత పరిస్థితులు కూడా సవాలుగా ఉన్నాయి. బ్యాంకులు డిపాజిట్ వృద్ధి మందగమనం ఎదుర్కొంటున్నాయి, ఇది క్రెడిట్ ప్రవాహాన్ని ప్రభావితం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లో డిమాండ్ స్థిరంగా లేవని చూపిస్తున్నాయి, ఇది కంపెనీల అమ్మకాలను ప్రభావితం చేసింది. దీనితో పాటు తయారీ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (GVA)లో కూడా మందగమనం కనిపిస్తుంది.
ఆర్బిఐ వ్యూహం
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆర్బిఐ బ్యాలెన్స్ విధానాన్ని అవలంబించి రేపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని నివేదిక సూచిస్తుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే, భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకునేలా జాగ్రత్తగా ఇంకా డేటా ఆధారిత విధానాన్ని అవలంబిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications