repo rate cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం నిర్ణయాలు వెల్లడయ్యాయి. దింతో లోన్స్ తీసుకునే వారికీ పెద్ద రిలీఫ్ లభించింది. RBI MPC 54వ సమావేశంలో అంటే కొత్త ఆర్థిక సంవత్సరం FY26 మొదటి సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక ఉద్రిక్తతలు అలాగే వాణిజ్య యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలుతో కూడిన వాతావరణంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుందని, దింతో రెపో రేటు 6 శాతానికి తగ్గిందని అన్నారు. 2025 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు ఇలా రిలీఫ్ ఇవ్వడం వరుసగా రెండవసారి. గత నెల ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతానికి మార్చారు. ఈ కొత 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చింది.

RBI MPC సమావేశంలో రెపో రేటు తగ్గింపుపై తీసుకున్న నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రెస్ కాన్ఫరెన్స్'లో మాట్లాడుతూ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2026 సవాళ్లతో ప్రారంభమైందని, అయితే గత ఏడాది మొదటి ఆరు నెలల్లో మందగమనం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతోందని అన్నారు . రెపో రెపో రేటును 0.25 శాతం తగ్గించడం గురించి మాట్లాడుతూ ఎంఎస్ఎఫ్ రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గిందని అన్నారు. SDF రేటును 6% నుండి 5.75%కి తగ్గించారు.
2025-26 మీటింగ్ షెడ్యూల్
మొదటిది 7-9 ఏప్రిల్ 2025
రెండవది 4-6 జూన్ 2025
మూడవది 5-7 ఆగస్టు 2025
నాల్గవది 29 సెప్టెంబర్ - 1 అక్టోబర్
ఐదవది 3-5 డిసెంబర్ 2025
ఆరవది 4-6 ఫిబ్రవరి 2026
రెపో రేటు అంటే ఏమిటి: రెపో రేటు అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు తీసుకునే వడ్డీ రేటు. బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టి RBI నుండి అప్పు తీసుకుంటాయి. ఈ లోన్ల పై చెల్లించాల్సిన వడ్డీని రెపో రేటు అంటారు.
రెపో రేటు తగ్గిస్తే లాభాలు: : బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునేలా ఆర్బిఐ రెపో రేటును తగ్గిస్తుంది. దింతో బ్యాంకులు కూడా ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. దీని వల్ల హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ మొదలైన లోన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది ఇంకా తక్కువ వడ్డీకే లభిస్తాయి. అలాగే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు, పెట్టుబడి పెడతారు, ఇది మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది కూడా.
రెపో రేటు పెంచితే నష్టాలూ: బ్యాంకులకు ఎక్కువ వడ్డీ రేట్లకు డబ్బు లభించేలా ఆర్బిఐ రెపో రేటును పెంచుతుంది.
అప్పుడు బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఎక్కువ వడ్డీ రేట్లకి ఇస్తుంటాయి. దీనివల్ల లోన్లు తీసుకోవడం కాస్త ఖర్చుతో కూడుకుంటుంది ఇంకా ప్రజలు తక్కువ ఖర్చు చేస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications