repo rate cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం నిర్ణయాలు వెల్లడయ్యాయి. దింతో లోన్స్ తీసుకునే వారికీ పెద్ద రిలీఫ్ లభించింది. RBI MPC 54వ సమావేశంలో అంటే కొత్త ఆర్థిక సంవత్సరం FY26 మొదటి సమావేశ ఫలితాలను ప్రకటిస్తూ, RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రపంచ ఆర్థిక ఉద్రిక్తతలు అలాగే వాణిజ్య యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాలుతో కూడిన వాతావరణంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుందని, దింతో రెపో రేటు 6 శాతానికి తగ్గిందని అన్నారు. 2025 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు ఇలా రిలీఫ్ ఇవ్వడం వరుసగా రెండవసారి. గత నెల ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతానికి మార్చారు. ఈ కొత 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చింది.

RBI MPC సమావేశంలో రెపో రేటు తగ్గింపుపై తీసుకున్న నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రెస్ కాన్ఫరెన్స్'లో మాట్లాడుతూ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 2026 సవాళ్లతో ప్రారంభమైందని, అయితే గత ఏడాది మొదటి ఆరు నెలల్లో మందగమనం తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతోందని అన్నారు . రెపో రెపో రేటును 0.25 శాతం తగ్గించడం గురించి మాట్లాడుతూ ఎంఎస్ఎఫ్ రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గిందని అన్నారు. SDF రేటును 6% నుండి 5.75%కి తగ్గించారు.
2025-26 మీటింగ్ షెడ్యూల్
మొదటిది 7-9 ఏప్రిల్ 2025
రెండవది 4-6 జూన్ 2025
మూడవది 5-7 ఆగస్టు 2025
నాల్గవది 29 సెప్టెంబర్ - 1 అక్టోబర్
ఐదవది 3-5 డిసెంబర్ 2025
ఆరవది 4-6 ఫిబ్రవరి 2026
రెపో రేటు అంటే ఏమిటి: రెపో రేటు అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు తీసుకునే వడ్డీ రేటు. బ్యాంకులకు డబ్బు అవసరమైనప్పుడు ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టి RBI నుండి అప్పు తీసుకుంటాయి. ఈ లోన్ల పై చెల్లించాల్సిన వడ్డీని రెపో రేటు అంటారు.
రెపో రేటు తగ్గిస్తే లాభాలు: : బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునేలా ఆర్బిఐ రెపో రేటును తగ్గిస్తుంది. దింతో బ్యాంకులు కూడా ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. దీని వల్ల హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్ మొదలైన లోన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది ఇంకా తక్కువ వడ్డీకే లభిస్తాయి. అలాగే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు, పెట్టుబడి పెడతారు, ఇది మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది కూడా.
రెపో రేటు పెంచితే నష్టాలూ: బ్యాంకులకు ఎక్కువ వడ్డీ రేట్లకు డబ్బు లభించేలా ఆర్బిఐ రెపో రేటును పెంచుతుంది.
అప్పుడు బ్యాంకులు కస్టమర్లకు రుణాలు ఎక్కువ వడ్డీ రేట్లకి ఇస్తుంటాయి. దీనివల్ల లోన్లు తీసుకోవడం కాస్త ఖర్చుతో కూడుకుంటుంది ఇంకా ప్రజలు తక్కువ ఖర్చు చేస్తారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications