Bengaluru News: దేశంలో ఐటీ జాబ్ అనగానే ముందుగా టెక్కీలు ఎంచుకునే ప్రదేశాలు బెంగళూరు లేదా హైదరాబాద్. కంపెనీలు సైతం ఈ రెండు నగరాల్లో పెద్ద ఆఫీసులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. నివాసయోగ్యంగా ఉండే ఈ రెండు నగరాల్లోని వసతులు వారిని ఎక్కువగా ఆకట్టుకోవటమే వారి ఎంపికకు కారణంగా ఉంది.
అయితే ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాగటానికి తప్ప మిగిలిన అవసరాలకు సరిపడా నీళ్లు లేకపోవటం అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే చాలా మంది టెక్కీలు బెంగళూరు ఆఫీసుల నుంచి హైదరాబాద్ ఆఫీసులకు తమ వర్క్ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అవును బెంగళూరు నుంచి టెక్కీలు హైదరాబాదుకు మారుతున్న వేళ ఇక్కడ వారికి అవసరమైన స్థాయిలో అద్దెకు ఇళ్లు లేకపోవటం కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. అద్దె ఇళ్లకు డిమాండ్ మామూలు కంటే ఎక్కువ కావటంతో ఇంటి ఓనర్లు నోటికొచ్చినంత అద్దె చెబుతున్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్క ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు గరిష్ఠంగా రూ.30,000 పైగానే పలుకుతున్నాయి. దీంతో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే ఇతర రంగాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఐటీ ఉద్యోగులకు ఇస్తే ఎక్కువ అద్దే వస్తుందనే ఆలోచనలో ఇంటి ఓనర్లు ఉండటం పరిస్థితులను తీవ్రతరం చేస్తోంది. ఈ పరిస్థితులపై చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే బెంగళూరులోని టెక్ కంపెనీలకు కేరళ ప్రభుత్వంలోని మంత్రులు ఆఫర్లు ఇవ్వటం, అన్ని వసతులు కల్పిస్తామని చెప్పటం కొంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు వనరులు, వసతులు ఉన్న కేరళ రాష్ట్రానికి తమ ఉద్యోగులను మార్చితే మంచిదనే ఆలోచనలో సగటు హైదరాబాదీలు ఉన్నారు. బెంగళూరులోని పరిస్థితులు తమకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయని వారు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications