కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద పెద్ద కంపెనీలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మద్దతును అందిస్తోంది. కరోనాపై పోరు చేస్తున్న ప్రభుత్వాలకు అండగా ఉంటోంది. ఇందులో భాగంగా రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉచితంగా ఇంధనం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉచితంగా డీజిల్, పెట్రోల్ అందిస్తామని తెలిపింది.

50 లీటర్ల వరకు ఉచిత ఇంధనం
కరోనాపై చేస్తోన్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తన వంతు మద్దతును అందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సహాయచర్యలకు ఉపయోగించే ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులకు రిలయన్స్ పెట్రోల్ బంకుల ద్వారా ఉచిత ఇంధనాన్ని అందిస్తామని తెలిపింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా ఆయా వాహనాలకు రోజుకు గరిష్ఠంగా 50 లీటర్ల ఇంధనాన్ని అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్ 30 వరకు ఇంధనం
ఈ ఉచిత ఇంధన సౌకర్యాన్ని జూన్ 30వ తేదీ వరకు కొనసాగిస్తామని రిలయన్స్ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మరో 80 టన్నుల చొప్పున లిక్విడ్ ఆక్సిజన్ను సమకూర్చినట్లు తెలిపింది. జామ్ నగర్ రిలయన్స్ ప్లాంట్ నుండి ఇండియన్ రైల్వేస్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రాన్సుపోర్ట్ చేసినట్లు తెలిపింది. రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే ఏ ఇతర కార్పోరేట్ సంస్థ ప్రారంభించని అతిపెద్ద మిషన్ అన్న సేవ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.

మిషన్ అన్న సేవ
మిషన్ అన్న సేవ కింద 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 200 మంది భాగస్వాములతో కలిసి 5.5 కోట్ల మందికి గ్రాసరీ కిట్స్, వండిన అన్నం, బల్క్ రేషన్ సరఫరా చేస్తోంది రిలయన్స్. ఇదిలా ఉండగా జూన్ 30వ తేదీ వరకు ప్రభుత్వం గుర్తించిన వాహనాలకు ప్రతి రోజు 50 లీటర్ల ఇంధనం ఉచితంగా అందించనున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. రాజస్థాన్లోని 109 రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications