జస్ట్ డయల్ కొనుగోలుకు ముఖేష్ అంబానీ ఆసక్తి, డీల్ వ్యాల్యూ రూ.6,600 కోట్లు!జస్ట్ డయల్ కొనుగోలుకు ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల పలు కంపెనీలను అక్వైర్ చేసుకుంటోంది. తాజాగా జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 800 నుండి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్‌డయల్‌‌తో చర్చలు జరుపుతోంది. మన కరెన్సీలో రూ.6,600 కోట్ల వరకు ఈ డీల్ ఉండవచ్చు. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్‌లోకి మరో కీలక సంస్థ వచ్చి చేరినట్లు అవుతుంది. ఇందుకు సంబంధించి జూలై 16న అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

జూలై 16న ఇందుకు సంబంధించి రిలయన్స్ బోర్డ్ సమావేశం ఉండనుందని తెలుస్తోంది. స్థానిక సెర్చ్ ఇంజిన్ సెగ్మెంట్‌లో జస్ట్‌డయల్ మార్కెట్ లీడర్‌గా వెలుగొందుతోంది. సగటున 150 మిలియన్ల క్వార్టర్లీ యూనిక్ విజిటర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ మొబైల్, యాప్స్, వెబ్ సైట్, టెలిఫోన్ హాట్ లైన్ నెంబర్ 8888888888 తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తోంది.

Reliance targets Justdail, in talks with the later for a big deal of Rs.6600 crore

జస్ట్ డయల్ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ఎస్ మణి, వీరి కుటుంబానికి ఈ సంసథలో 35.5 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వ్యాల్యూ ప్రస్తుతం రూ.2,387.9 కోట్లుగా ఉంది. జస్ట్ డయల్‌ను మణి నుండి కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను దక్కించుకోనుంది. అదే జరిగితే రిలయన్స్ వాటా 60 శాతానికి చేరుకుంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+