రిలయన్స్ స్మార్ట్ సూపర్ ఆఫర్, రూ.1,499 ఖరీదు చేస్తే కిలో చక్కెర రూ.9 మాత్రమే
రిలయన్స్ రిటైల్కు చెందిన భారీ స్థాయి సూపర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ తన కొత్త స్టోర్ను బండ్లగూడా జాగీర్ లోని HP పెంట్రోల్ బంక్ దగ్గర చేవెళ్ల రోడ్లో శుక్రవారం ప్రారంభించింది. ఒకే కేంద్రంలో బహుళ విధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
కరోనా దెబ్బ: రూ.10 లక్షలకోట్ల సంపద ఆవిరి, ప్రపంచ మార్కెట్లో అతి పెద్ద పతనం
రిలయన్స్ స్మార్ట్.. ఆకర్షణీయ ఆఫర్..
రిలయన్స్ స్మార్ట్ వినియోగదారులు చెల్లించే మొత్తానికి తగిన నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతో పాటుగా ఎంఆర్పీపై కనీసం 5 శాతం డిస్కౌంట్ను అన్ని ఉత్పత్తులపై సంవత్సరం పొడవునా అందిస్తోంది. అంతేకాకుండా రూ.1499 విలువ గల వస్తువులు కొనుగోలు చేస్తే కిలో పంచదారను రూ.9 కనీస ధరతో అందించడం వంటి ఆకర్షణీయ ఆఫర్ ఇస్తోంది.
తక్కువ ధరలకే పండ్లు, కూరగాయలు
ఇలాంటి ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్ల వల్ల దేశవ్యాప్తంగా నెలవారి కిరాణ సరుకుల కోసం చాలామంది రిలయన్స్ స్మార్ట్ని ఎంచుకుంటున్నారు. వీటితో పాటు ప్రధానమైన ఉత్పత్తులను, పండ్లు మరియు కూరగాయలను ప్రతిరోజు తక్కువ ధరలకే అందిస్తోంది.
తెలంగాణలో 23వ స్టోర్
ఈ రోజు ప్రారంభమైన బండ్లగూడ స్టోర్తో కలిపి తెలంగాణలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 23కు చేరుకుంది. 20,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువు దీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉంది. నాణ్యమైన ఉత్పత్తులు, ఆకర్షణీయ ధరలతో రిలయన్స్ స్మార్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
వినియోగదారుడిపై ప్రత్యేక దృష్టి సారించి..
గత కొన్నేళ్లుగా రిలయన్స్ స్మార్ట్ తన వినియోగదారులకు సంబంధించిన దైనందిన, ప్రత్యేక సందర్భాలకు తగిన అవసరాలను అన్ని రకాలైన ధరలతో కూడిన ఉత్పత్తులను అందిస్తోంది. వినియోగదారుడిపై ప్రత్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని తన వినియోగదారులకు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్ కేటగిరీలో విస్తృత శ్రేణిలో ఉత్పత్తుల్ని అందించడంతో పాటు కస్టమర్లకు స్థలంపరంగానూ సారుప్యంగా అందుబాటులో ఉంది.