బాండ్స్ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించనున్న రిలయన్స్

ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేసుకునేందుకు మార్పిడి రహిత డిబెంచర్లు (NCD) జారీ చేసి రూ.10,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థని నిలబెట్టేందుకు వ్యవస్థలోకి అదనపు లిక్విడిటీని జొప్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఆయిల్ నుండి టెలికం వరకు అన్ని కంపెనీలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయి.

మార్పిడి రహిత డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్న రిలయన్స్ ఇష్యూ ప్రారంభించనుంది. ఈ మేరకు ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. ఈ ఇష్యూలో రెండు భాగాలు ఉన్నాయి. ఫిక్స్డ్ రేట్ కలిగిన రూ.4500 కట్ల ఇష్యూ ఒకటి. రెండోది అంతే మొత్తంకలిగిన ప్లోటింగ్ రేట్ ఇష్యూ. ఈ రెండు ఇష్యూలు 7.20 శాతం కూపన్ రేటును అందిస్తాయి. ప్రయివేటు ప్లేస్‌మెంట్ పద్ధతిలో NCDలు జారీ చేస్తారు.

Reliance plans to raise up to Rs 10,000 crore via bonds

30,000 అన్ సెక్యూర్డ్ రెడీమబుల్ ఫిక్స్డ్ కూపన్ కలిగి ఉంటుంది. రూ.10 లక్షల ముఖ విలువ కలిగిన ఒక్కో NCDతో రూ.3,000 కోట్ల వరకు సమీకరిస్తారు. అధిక స్పందన లభిస్తే గ్రీన్ షూ ఆప్షన్ కింద మరో రూ.1500 కోట్ల వరకు NCDల జారీ ఉంటుంది. ఇక ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఇష్యూలో రూ.10 లక్షల ఫేస్ వ్యాల్యూ కలిగిన NCDలను జారీ చేయడం ద్వారా రూ.3,500 కోట్లు సమీకరిస్తుంది. ఇక్కడ రూ.1,000 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్ ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+