కంపెనీ మార్కెటింగ్ టీం ప్రొడక్ట్స్ ప్రోత్సహించడానికి ఏ అవకాశాన్ని మిస్ చేసుకోదు. అయితే, కొన్నిసార్లు కొన్ని తప్పులు కూడా చేస్తారు, ఈ కారణంగా సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. సాఫ్ట్ డ్రింక్ కాంపా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సోషల్ మీడియా Xలో కాంపాపై మరోసారి #boycott ట్రెండవుతుంది. అయితే పూరీలో ప్రారంభమయ్యే రథయాత్రకు సంబంధించి కంపెనీ ప్రమోషన్లో ఒక ట్యాగ్ లైన్ వ్రాసింది. దింతో ప్రజలు కంపెనీ వ్యతిరేకతని ప్రారంభించారు. చివరకి #BoycottCampa కొద్దిసేపటిలోనే ట్రెండింగ్ ప్రారంభమైంది. అయితే, కంపెనీ ఇంకా దీని గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

నిజానికి, ఈ రథయాత్ర జనవరి 26న జగన్నాథ్ పూరిలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా CAMPA ఒడిశాలోని చాల ప్రాంతాలలో ప్రమోషన్ కోసం హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. దీనిని ఒరియా భాషలో - 'రథ్ కా మార్గ్, CAMPA కే సాథ్' అని రాశారు. దీనితో పాటు, ఆలయం ఫోటోను కూడా పెట్టారు. ఈ ప్రమోషన్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రజలు ఆరోపించారు. ఆలయం పేరును ప్రమోషన్ కోసం ఉపయోగిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. అయితే CAMPAకి ఇలా చేసే హక్కు లేదు.
కాంపా కోలా చరిత్ర : సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ 1977లో భారతదేశంలో ఈ కంపెనీని ప్రారంభించింది. దీనికి ముందు ఈ కంపెనీ కోక్తో కలిసి కోకా-కోలాను తయారు చేసేది. మొదట్లో ఈ కంపెనీ నినాదం - 'ది గ్రేట్ ఇండియన్ టేస్ట్'. దాదాపు 15 సంవత్సరాల తర్వాత విదేశీ కోలా మార్కెట్ ప్రవేశం కారణంగా కాంపా మార్కెట్ నుండి అదృశ్యమైంది. 2000 సంవత్సరంలో కంపెనీ ఢిల్లీలో ఆఫీస్ ఇంకా ప్లాంట్ను మూసివేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2022లో కాంపా కోలాను 22 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ కంపెనీల ప్రకటనలపై వివాదం : ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆన్లైన్ హోటల్ బుకింగ్ సౌకర్యాలను అందించే OYO సంస్థ వార్తాపత్రికలో 'దేవుడు ప్రతిచోటా ఉన్నాడు, OYO కూడా' అని ప్రకటన ఇచ్చింది. దీనితో #BycottOYO ట్రెండ్ ప్రారంభమైంది. దీనిపై కంపెనీ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పింది. అదేవిధంగా, 2021 సంవత్సరంలో డాబర్ కంపెనీ వివాదంలోకి వచ్చింది. కార్వా చౌత్ నాడు స్వలింగ సంపర్కుల జంట కర్వా చౌత్ జరుపుకుంటున్నట్లు కంపెనీ చూపించింది. ఇది ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమించారు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..



Click it and Unblock the Notifications