మూడు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్ల అతిపెద్ద రైట్స్ ఇష్యూను జారీ చేసింది. గత 10 ఏళ్లలో నాన్-ఫైనాన్షియల్ ఇష్యూయర్లో ప్రపంచంలోనే ఇది అతిపెద్దది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చమురు రంగం నుండి రిటైల్, టెలికం రంగం వరకు విస్తరించిన రిలయన్స్.. రైట్స్ ఇష్యూను మే 20వ తేదీన ప్రారంభించింది. జూన్ 3న ముగుస్తోంది.

10 ఏళ్లలో తొలిసారి..
డయలాజిక్ (సమగ్ర వివరాలు అందించే ఫైనాన్షియల్ మార్కెట్ ప్లాట్ఫామ్) డేటా ప్రకారం గత 10 ఏళ్లలో నాన్-ఫైనాన్షియల్ ఇష్యూయర్లో రిలయన్స్ రైట్స్ ఇష్యూ అతి పెద్దది. అంతకుముందు 2018 జూన్ నెలలో ప్రస్తుత మొత్తానికి దగ్గరగా ఉండే రైట్స్ ఇష్యూను బైయర్ ఏజీ జారీ చేసింది. అప్పుడు ఇది 7,002 బిలియన్ డాలర్ల ఇష్యూ జారీ చేసింది. మార్చి 2021 నాటికి రిలయన్స్ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దేందుకు ముఖేష్ అంబానీ వివిధ రూపాల్లో పెట్టుబడులు సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా జియో ప్లాట్ఫామ్ వాటాలు విక్రయించడంతో పాటు రైట్స్ ఇష్యూకు వచ్చారు.

సోమవారం నాటికే 1.1 రెట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకు రూ.1,257 ధరను కేటాయించింది. కంపెనీలో షేర్లు కొనుగోలు చేసిన వారు తమ వద్ద గల ప్రతి 15 షేర్లకు ఒక షేరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజుతో ముగుస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ రైట్స్ ఇష్యూకు వచ్చింది. అంతకుముందు 1991లో జారీ చేసింది. ఈ రైట్స్ ఇష్యూకు అనూహ్య స్పందన వచ్చింది. స్టాక్ ఎక్స్చేంజీ డేటా ప్రకారం మరో రెండు రోజులు గడువు ఉండగానే అంటే ఈ నెల 1వ తేదీ నాటికి 1.1 రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యారు.

2008 నుండి అతిపెద్ద రైట్ ఇష్యూస్ ఇవే
2008లో ఆర్థిక సంక్షోభం అనంతరం HSBC హోల్డింగ్స్ ఏప్రిల్ 2009లో 19.57 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూను జారీ చేసింది. నాటి నుండి అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇదే. అక్టోబర్ 2010లో డచ్ బ్యాంకు 13.96 బిలియన్ డాలర్ల రైట్స్ ఇష్యూ జారీ చేసింది. ఇది రెండో అతిపెద్ద రైట్స్ ఇ,్యూ. ఆ తర్వాత యునిక్రెడిట్ 13.69 డాలర్ల మూడో అతిపెద్ద రైట్స్ ఇష్యూ జారీ చేసింది.
ఆసియాలో అతిపెద్ద రైట్స్ ఇష్యూ 2010 డిసెంబర్లో బ్యాంక్ ఆఫ్ చైనా జారీ చేసింది. దీని వ్యాల్యూ 8.96 బిలియన్ డాలర్లు.

రుణరహిత కంపెనీగా..
గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్ ముగిసేనాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు 3,36,294 కోట్లుగా ఉన్నాయి. క్యాష్ రూపంలో రూ.1,75,259 కోట్లు ఉండగా, నెట్ రుణాలు రూ.1,61,035 కోట్లుగా ఉంది. జియో ప్లాట్ఫామ్స్ విక్రయం ద్వారా రూ.78,000 కోట్లు సమీకరించారు. సౌదీ ఆరామ్కోకు చమురు, కెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటా విక్రయించడం ద్వారా 15 బిలియన్ డాలర్లు సమీకరించాలని భావిస్తోందిత. ఫ్యూయల్ రిటైల్లో బీపీసీఎల్కు రూ.7,000 కోట్లకు, టెలికమ్యూనికేషన్ టవర్ బిజినెస్లో బ్రూక్ఫీల్డ్కు రూ.25,200 కోట్లకు విక్రయిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications