కచ్లో రిలయన్స్, సింగపూర్ కంటే 3 రెట్లు పెద్ద సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తోంది
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఓ పెద్ద అప్డేట్ ఇచ్చారు. గుజరాత్లోని కచ్ లో 5,50,000 ఎకరాల ఎండిన భూమి మీద 'ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-సైట్ సోలార్ ప్రాజెక్ట్' నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది సింగపూర్ కంటే మూడు రెట్లు పెద్దది.

రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో భారత్ విద్యుత్ అవసరాల్లో దాదాపు 10% విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన ఒక భారీ ప్రణాళిక. కచ్లోని ఎండిపోయిన భూభాగంలో ఏర్పాటు అయ్యే ఈ ప్రాజెక్ట్లో రోజుకు 55 MW సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్స్ మరియు 150 MWh సామర్థ్యం గల బ్యాటరీ కంటైనర్లు అమర్చబడ్డాయి. వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి వేగంగా, సమర్థవంతంగా జరుగుతుంది. దీనివల్ల ప్రపంచంలో వేగంగా అమలు అవుతున్న సోలార్ ప్రాజెక్ట్లలో ఇది ఒకటి కావడం ప్రత్యేకత.
ప్రాజెక్ట్ జామ్నగర్ మరియు కాండ్లా పోర్ట్లతో నేరుగా కనెక్ట్ చేయబడి ఉంటుంది, దీని ద్వారా పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ ఉత్పత్తి మరియు గ్రీన్ హైడ్రజన్ ఉత్పత్తిని సమన్వయంగా ఇంటిగ్రేట్ చేయడం సులభం అవుతుంది. ఇక్కడ నిర్మిస్తున్న సిస్టమ్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం కాకుండా, ఇండస్ట్రీల్, రవాణా, మరియు గ్రీన్ ఫ్యూయల్ అవసరాలను కూడా సమర్థవంతంగా మద్దతు ఇవ్వగల విధంగా ప్లాన్ చేయబడింది.
రిలయన్స్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా, "గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్" ఉత్పత్తి చేసి ఎగుమతి చేయనుంది. దీని ఫలితంగా భారత్ను "ప్రపంచ గ్రీన్ హైడ్రజన్ హబ్" గా మార్చే అవకాశం ఉంది. 2032 నాటికి కంపెనీ "3 MTPA గ్రీన్ హైడ్రజన్ సామర్థ్యం" చేరుకోవాలని ప్రణాళిక వేసింది.
సూపర్ సోలార్ మాన్యుఫాక్చరింగ్
* రిలయన్స్ కొత్త "సోలా PV మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్" ప్రారంభించింది. మొదటి 200 MW HJT మాడ్యూల్స్ ఇప్పటికే ఉత్పత్తి అయ్యాయి.
* ఇవి సాధారణ మాడ్యూల్స్ కంటే:
* 10% ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి
* 20% మెరుగైన టెంపరేచర్ పనితీరు
* 25% తక్కువ డిగ్రడేషన్
* రాబోయే క్వార్టర్స్లో 10 GWp వార్షిక ఉత్పత్తి, తర్వాత 20 GWp వరకు విస్తరిస్తారు. దీని ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద, ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫాక్చరింగ్ సైటుగా ఉంటుంది.
రిలయన్స్ ప్రాజెక్ట్లో బ్యాటరీ మరియు హైడ్రజన్ ఫ్యాక్టరీలు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2026 లో ప్రారంభమయ్యే బ్యాటరీ గిగాఫ్యాక్టరీ ప్రస్తుతానికి సంవత్సరానికి 40 GWh సామర్థ్యం కలిగి ఉంటుంది, భవిష్యత్తులో దీన్ని 100 GWh వరకు పెంచే అవకాశముంది. అదే సమయంలో, 2026 చివరినాటికి ప్రారంభం కానున్న ఎలక్ట్రోలైజర్ గిగాఫ్యాక్టరీ 3 GW సామర్థ్యంతో పనిచేయనుంది, ఇది పెద్ద ఎత్తున, తక్కువ ఖర్చుతో గ్రీన్ హైడ్రజన్ ఉత్పత్తిని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు ఫ్యాక్టరీల ద్వారా రిలయన్స్ తన సోలార్, బ్యాటరీ, హైడ్రజన్ ఎనర్జీ సిస్టమ్ను సమగ్రంగా, సమర్థవంతంగా నడిపే అవకాశం కల్పిస్తుంది.
"సోలార్, బ్యాటరీ స్టోరేజ్, హైడ్రజన్ ఆల్ అండర్ వన్ రూఫ్ కింద ఖర్చులు తగ్గి, టెక్నాలజీ బలపడుతుంది, సరఫరా శ్రేణి కూడా స్ట్రాంగ్ అవుతుంది. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేగంతో, రిలయన్స్ దీర్ఘకాల విలువ సృష్టించగలదు" అని ముఖేష్ అంబానీ అన్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం RIL కోసం కాదు, భారత్ ఎనర్జీ మ్యాప్ని మార్చే సామర్థ్యం కలిగినది. ఇది ఇండియాను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్గా నిలిపే అవకాశాన్ని చూపిస్తోంది.


Click it and Unblock the Notifications