JIO 6G: సోమవారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ కంపెనీ భవిష్యత్తుకు సంబంధించిన అనేక ప్రణాళికల గురించి వెల్లడించారు.
ఈ క్రమంలో ఇప్పటికే టెలికాం రంగంలో దిగ్గజంగా కొనసాగుతున్న జియో.. ఇంటర్నెట్ యూజర్లను టార్గెట్ చేసుకుని అనేక సేవలను అందుబాటులోకి తెలుస్తోంది. ఈ క్రమంలో జియో ప్లాట్ఫారమ్ లు కీలక భూమిక పోషిస్తున్నాయి. అయితే ఇవి భవిష్యత్తు టెక్నాలజీలకు అనుగుణంగా 6జీ సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉండేవిగా అభివృద్ధి చేస్తున్నట్లు అంబానీ వెల్లడించారు. ప్రపంచంలో ఈ తరహా చర్యలు చేపట్టిన సంస్థల్లో జియో మెుదటి స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా అనేక నగరాలకు తన 5జీ నెట్వర్క్ సేవలను విస్తరించే పనిలో వేగంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ వంటి సంస్థలతో కలిగి పనిచేస్తోంది. వారి నుంచి అవసరమైన టెలికాం సామాగ్రిని కొనుగోలు చేస్తోంది. ఇదే క్రమంలో జియో ప్లాట్ఫారమ్లు తమ వినూత్నమైన "మేడ్-ఇన్-ఇండియా" టెక్నాలజీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని, విస్తరించాలని కోరుకుంటున్నట్లు అంబానీ తెలిపారు.
దీనికి తోడు రిలయన్స్ జియో ప్లాట్ ప్లాట్ఫారమ్ లు చాట్ జీపీటీ మాదిరిగా తమ సొంత ఏఐ సిస్టమ్ సిద్ధం చేసుకుంటున్నట్లు ముఖేష్ అంబానీ ఏజీఎంలో వెల్లడించారు. దేశంలోని ప్రతి వ్యక్తికి ఏఐ అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కువ పరికరాలు కనెక్ట్ అవటంతో పాటు అధిక ఇంటర్నెట్ స్పీడ్ 6జీ సాంకేతికత రానున్న కాలంలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. దీనిపై రిలయన్స్ గ్రూప్ భారీగా పెట్టుబడులను కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఆందోళనలో ఉన్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications