రిలయన్స్ జియోలో ఫేస్బుక్ రూ.43,574 కోట్ల మొత్తంతో 9.99% వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పరస్పర ప్రయోజనంతో ఈ ఒప్పందం కుదిరింది. లాక్ డౌన్ సమయంలో ఇది అతి పెద్ద కార్పోరేట్ డీల్. అయితే ఇది ఎక్స్కుల్జీవ్ డీల్ కాదని రెండు కంపెనీలు వెల్లడించాయి. ఏదేమైనా ఈ డీల్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. కొన్ని అంశాల్లో ఈ రెండు కంపెనీల అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి.

జియో ఇలా, ఫేస్బుక్ అలా
ఓవర్ ది టాప్(OTT) ప్లాట్పామ్స్ పూర్తి డేటా యాక్సెస్ ఇక్కడివారికే ఉండాలని, ఎంఎన్ఎసీలకు కాదని జియో గత ఏడాది ట్రాయ్కు తెలిపింది. ఇండియన్ గవర్నమెంట్తో డేటాను పంచుకోవాల్సిన అవసరం లేదని ఫేస్బుక్ గత ఏడాది అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ రెండు కంపెనీలు కూడా తమ తమ వైఖరిని మార్చుకునే అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు. అయితే ఈ రెండు సంస్థలు కూడా డేటా, ఎన్క్రిప్షన్కు సంబంధించి కలిసి పని చేయనున్నాయి.

జియో-ఫేస్బుక్ స్వతంత్ర సంస్థలు..
జియో - ఫేస్బుక్ డీల్కు ముందే వివిధ అంశాలపై ఇరు కంపెనీలు చర్చించుకున్నాయని అంటున్నారు. పై అంశాలు వేరని, ఒప్పందం పూర్తిగా వాణిజ్యపరమైనదని చెబుతున్నారు. ఒప్పందాన్ని రూపొందించే విధానంలో ఎలాంటి విబేధం, వివాదం లేదని అంటున్నారు. ఫేస్బుక్, జియో స్వతంత్ర సంస్థలు అని, ఈ రెండు సంస్థలు కలిసి పని చేసే పరిధి ఉన్నట్లే, ఒప్పందంలో లేకుండా విభేదించే అంశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కూడా తమ వినియోగదారుల డేటా గురించి అవగాహన కలిగి ఉన్నాయని, కస్టమర్ డేటాను గౌరవిస్తామని చెబుతున్నారు.

స్వతంత్ర ఆలోచనలు
ఇండియాలోని లక్షలాదిమంది సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారులకు కొత్త అవకాశాలను కల్పించడం కోసమే జియో ప్లాట్పాంతో ఒప్పందమని ఫేస్బుక్ తెలిపింది. వివిధ అంశాలపై జియో-ఫేస్బుక్ స్వతంత్ర అభిప్రాయాలు కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ ఒప్పందం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి వెళ్తుందని వెల్లడించింది. విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ పరస్పర ప్రయోజనంతో వాటిని అధిగమిస్తాయని అంటున్నారు.

ముఖేష్-జుకర్ బర్గ్ ఎవరి ఆలోచన వారిది.. ఎలా అధిగమిస్తారో..
కేవలం ఇండియా కోసమే జియో కోసమే ఫేస్బుక్ తన విధానాలను మార్చుకునే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది గ్లోబల్ కంపెనీ అని గుర్తు చేస్తున్నారు. దీని ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైనవని అంటున్నారు. డేటా స్థానికీకరణపై ముఖేష్ అంబానికి కూడా స్పష్టమైన, బలమైన అభిప్రాయం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలను ఎలా అధిగమిస్తారో చూడాలని అంటున్నారు.

ఫేస్బుక్ పెట్టుబడి కంటే జియో వ్యాపార ఆసక్తి బలమైనది
డేటా స్థానికీకరణ వంటి అంశాలపై ఫేస్బుక్ తన అభిప్రాయాలు మార్చుకునే అవకాశం లేదని, అలా జరిగితే ఇతర దేశాలలోను ఈ దిగ్గజ సంస్థపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అలాగే జియో కూడా డేటా స్థానికీకరణకు కట్టుబడి ఉండే అవకాశాలే ఉంటాయని చెబుతున్నారు. డేటా లోకలైజేషన్కు తాము కట్టుబడి ఉన్నామని, డేటా ఎక్కడైతే ఉత్పత్తి అయిందో ఆ దేశంలోనే ఉండే ఏ పరికరంలోనైనా డేటాను నిల్వచేసి ఉంచడాన్ని డేటా లోకలైజేషన్ అంటారు. దీనికి జియో కట్టుబడి ఉండవచ్చు. ఫేస్బుక్ పెట్టుబడి కంటే జియో వ్యాపార ఆసక్తి చాలా బలంగా ఉందని చెబుతున్నారు. ఈ రెండు కంపెనీల ఒప్పందాల్లో ఈ అంశాలు ఏ మేరకు ప్రాధాన్యత కలిగి ఉంటాయి, ఎలా అధిగమిస్తాయనేది ఆసక్తికరం అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications