పండుగ సీజన్లో రిలయన్స్ జ్యువెల్స్ కొత్త 'ఉత్కల'
పండుగ సీజన్ ప్రారంభానికి గుర్తుగా భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్ అద్భుతమైన ఆభరణాల శ్రేణి ఆఫర్లను ప్రారంభించింది. దీనికి ప్రేరణ ఒడిశా సాంస్కృతిక సాంప్రదాయాలు. రాష్ట్ర కళ, సాంప్రదాయం, సంస్కృతి పరిపూర్ణతకు ప్రతిబింబించే విలక్షణమైన మూలాంశాలు, నమూనాలు, రూపకల్పనల నిజమైన సంగమం. అద్భుతమైన సేకరణ అత్యంత అందమైన డిజైన్లను కలిగి ఉంది. ఇక్కడ వినియోగదారులు వివిధ రకాలైన రూపకల్పన, కళాత్మకంగా రూపొందించిన ఆభరణాల నుండి ఎంచుకోవచ్చు. సున్నితమైన కళాత్మకత అనేది కోణార్క్ సన్ ఆలయ శిల్పకళ, ముక్తేశ్వర్ ఆలయ శిల్పకళ, పూరి జగన్నాథ్ ఆలయ శిల్పకళ, సీంతి నృత్య శిల్పకళ, బోయితా బంధన సముద్ర వారసత్వం చిత్రకళ, అన్యదేశ పట్టాచిత్ర చిత్ర కళల నుండి ప్రేరణ పొందింది.
చోకర్ సెట్ల నుండి మొదలు చిన్న నెక్లస్ వరకు, పొడవైన, పరిపూర్ణ, సొగసైన నెక్లస్ సెట్ల వరకు వివిధ శ్రేణుల్లో ఉన్నాయి. వివిధ సందర్భాల్లో... బడ్జెట్లకు అనుగుణంగా ఇవి అందుబాటులో ఉన్నాయి. 22 క్యారెట్లతో ఈ గోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ జ్యువెల్లరీస్ అందుబాటులో ఉన్నాయి. 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన డైమండ్ సెట్స్ పండుగ సమయంలో, సమకాలీన రూపాలకు ఖచ్చితంగా సరిపోతాయి.
దేశంలో జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి అని, ధన్థెరాస్ సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదంగా పరిగణిస్తారని రిలయన్స్ జ్యువెల్స్ ప్రతినిధి అన్నారు. ఆభరణాలలో తమ డిజైన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఉత్కలను అందిస్తున్నామని తెలిపారు. ధన్ థెరాస్ పర్వదినంకు ముందు ఈ సేకరణను అందించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందన్నారు. ఉత్కల సేకరణ అక్టోబర్ 17వ తేదీ నుండి భారతదేశంలోని రిలయన్స్ జ్యువెల్స్ అవుట్ లెట్లలో అందుబాటులో ఉన్నాయి. బంగారు ఆభరణాలు & బంగారు నాణేల తయారీ ఛార్జీల మీద ఫ్లాట్ 30% తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ ఇన్వాయిస్ విలువపై 30% తగ్గింపు ప్రత్యేక ఆఫర్ ఉంది. 16 నవంబర్ 2020 వరకు కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. అయితే షరతులు వర్తిస్తాయని రిలయన్స్ జ్యువెల్స్ తెలిపింది