గోల్డ్ జ్యువెల్లరీ, డైమండ్ రింగ్స్పై రిలయన్స్ జ్యువెల్స్ బంపరాఫర్!
దేశీయ దిగ్గజ జ్యువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన కలెక్షన్లను లాంచ్ చేసింది. అభర్ పేరుతో సరికొత్త డిజైన్లలో బంగారం, వెండి, వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇటీవలి వరకు బంగారం ధరలు రోజురోజుకు పెరిగాయి. ఇటీవల తగ్గినప్పటికీ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు రూ.55,000 వరకు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రిలయన్స్ జ్యువెల్స్ కస్టమర్లకు బంపరాఫర్లు అందిస్తోంది.
బంగారం ధర భారీగా పతనం: వేలల్లో తగ్గుదల.. ఇక ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది?
3 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు
అభర్ కలెక్షన్స్లో 54 ప్రత్యేకమైన డిజైన్లతో హ్యాండ్క్రాఫ్ట్ బంగారం, డైమండ్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవి 3 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు ఉన్నాయి. దశాబ్దానికి పైగా తమ బ్రాండ్ను అండగా నిలిచినందుకు కస్టమర్లకు కృతజ్ఞతాపూర్వకంగా మీకు మేం రుణపడి ఉన్నామనే థీమ్తో ఒక ప్రమోషన్ వీడియోను కూడా విడుదల చేసింది.
30 శాతం వరకు డిస్కౌంట్.. షరతులు
బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీల మీద పై 30 శాతం (ఫ్లాట్), డైమండ్ జువెలరీపై 30 శాతం వరకు తగ్గింపుతో ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్ను ప్రకటించింది. ఆగస్ట్ 31 వరకు ఈ వార్షికోత్సవ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ తెలిపింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక ఆభరణాలు దేశంలోని అన్ని రిలయన్స్ జ్యువెల్స్ దుకాణాలలో లభ్యమవుతాయి. ఎన్నో ప్రత్యేక ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
కరోనా భద్రతా చర్యలు
ప్రస్తుతం కరోనా నేపథ్యంలోను కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. రిలయన్స్ జ్యువెల్లోకి ప్రవేశించే సమయం నుండి నిష్క్రమించే వరకు సామాజిక దూరం వంటి వివిధ మార్గదర్శకాలపై భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు ఉన్నట్లు తెలిపింది.