Mukesh Ambani: రూ.50 వేల కోట్ల మెగా పెట్టుబడి ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ..!

Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో సంస్థ పెట్టుబడిని నాలుగు రెట్లు పెంచి రూ.50,000 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఒక ఏఐ డేటా సెంటర్, ప్రపంచ స్థాయి సంపీడన బయోగ్యాస్ కేంద్రాలు, మెగా ఫుడ్ పార్క్, సెవెన్-స్టార్ ఒబెరాయ్ హోటల్, రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపులో ఇన్వెస్ట్ చేస్తామన్నారు.

వివరాల్లోకి వెళితే రిలయన్స్ అసోంలో ఏఐ-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు AI-సహాయక ఉపాధ్యాయుల నుంచి ప్రయోజనం పొందుతారు. రోగులు AI-సహాయక వైద్యుల నుంచి ప్రయోజనం పొందుతారని అంబానీ వెల్లడించారు. వ్యవసాయంతో పాటు యువత ఇంటి నుండి నేర్చుకోవడానికి AI సహాయపడుతుందని అంబానీ అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడి, మౌలిక సదుపాయాల సదస్సులో వెల్లడించారు. దీనికి ముందు 2018లో జరిగిన గత సదస్సులో రిలయన్స్ రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడికి కట్టుబడి ఉండగా.. ప్రస్తుతం అది రూ.12,000 కోట్లకు చేరుకుందని అంబానీ అన్నారు.

Reliance Industries planning to invest 50000 crores in assam know details

ప్రభుత్వం కొత్త విధానానికి అనుగుణంగా రిలయన్స్ అసోంను అణుశక్తితో సహా స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా మారుస్తుంది. రిలయన్స్ ఈ రాష్ట్రంలోని బంజరు భూమిలో ప్రపంచ స్థాయి కంప్రెస్డ్ బయో గ్యాస్ కేంద్రాలను నిర్మిస్తుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల స్వచ్ఛమైన బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయని రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. ఇది ప్రతిరోజూ 2 లక్షల ప్రయాణీకుల వాహనాలకు సరిపోతుందని అంచనా వేయబడింది. ఇదే క్రమంలో సంస్థ ఒక మెగా ఫుడ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసి సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడిస్తుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే అసోంలో క్యాంపా, ఇండిపెండెన్స్ బ్రాండ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కోసం ప్రపంచ స్థాయి బాట్లింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు అంబానీ వెల్లడించారు. ఇదే క్రమంలో రానున్న ఐదేళ్లలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను డబుల్ చేయనున్నట్లు అంబానీ ఈ క్రమంలో వెల్లడించారు. రాష్ట్రంలో హై-ఎండ్ హాస్పిటాలిటీ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి విలాసవంతమైన సెవెన్-స్టార్ ఒబెరాయ్ హోటల్‌ను నిర్మిస్తుందని చెప్పారు.

రిలయన్స్ ఫౌండేషన్ దాని 'స్వదేశ్' దుకాణాలతో, 'గ్రీన్ గోల్డ్' లేదా వెదురు, ప్రసిద్ధ పట్టు పరిశ్రమ కేంద్రమైన సుల్కుచిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తుందని రిలయన్స్ వెల్లడించింది. ఇదే క్రమంలో అదానీ గ్రూప్ కూడా అసోంలో రూ.50 వేల కోట్ల కొత్త పెట్టుబడిని ప్రకటించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+