Mukesh Ambani: దేశంలోని అత్యంత సంపన్నుడి స్థానాన్ని కొనసాగిస్తున్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఆయిల్ అనుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లో కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తాజాగా ట్రెండింగ్ లో ఉన్న మరో రంగాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతిపెద్ద సీక్రెట్ డీల్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సోలార్ ప్యానెళ్ల తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకునేందుకు చైనాకు చెందిన సరఫరాదారుతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బొగ్గు లేకుండా పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఆ విధంగా సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలు ప్రస్తుతం తమ ప్రణాళికలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీలు తమ సోలార్ పవర్ ఉత్పాదన పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా చైనాకు చెందిన లింటన్ టెక్నాలజీస్తో రిలయన్స్ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడైంది. లింటన్ టెక్నాలజీస్ సౌర ఫలకాలను తయారు చేయడానికి ఉపయోగించే సెల్ల కోసం పొరల తయారీలో చైనాలో నంబర్ వన్ తయారీదారుగా ఉన్నందున రిలయన్స్ ఈ సంస్థతో జతకట్టిందని తెలుస్తోంది. ఈ కంపెనీకి రిలయన్స్ భారీ ఆర్డర్ ఇచ్చిందని తెలిసింది. 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వేఫర్ల తయారీకి సంబంధించిన యంత్రాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్ల కోసం డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే అదానీ గ్రూప్ ఈ రంగంలో ముందుగా అడుగుపెట్టి వేగంగా వృద్ధి చెందుతోంది.
ఇప్పటికే అదానీ గ్రూప్ దేశంలో రెండు గిగావాట్ల సోలార్ పవర్ పార్కులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వీలైనంత త్వరగా 8 గిగావాట్లకు చేర్చాలని చూస్తోంది. ఇదే క్రమంలో అంబానీ సైతం దూకుడు పెంచటంతో ఇద్దరి మధ్య పోటీ పెరగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అదానీని అధిగమించటానికి.. 10 GW సౌర ఫలకాలను ఏర్పాటు చేయడానికి ముడి పదార్థాల కోసం లింటన్ టెక్నాలజీస్ గ్రూప్ వద్ద రిలయన్స్ ఆర్డర్ పెట్టిందని తెలుస్తోంది. రిలయన్స్ గుజరాత్లోని జామ్ నగర్లో 20 GW సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందుకోసం యంత్రాల కొనుగోలు కోసం కంపెనీ ఇప్పటికే 20 మంది సరఫరాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా రిలయన్స్ త్వరలో ఈ టెక్నాలజీని ఇండియాకు తీసుకురానుందని అంటున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications