ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం.. తన రిటైల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోంది. ఇప్పటికే రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ ఫుట్ ప్రింట్, రిలయన్స్ ట్రెండ్స్ పేరుతో దేశవ్యాప్తంగా తన ఔట్లెట్లను నెలకొల్పిన రిలయన్స్.. తాజాగా.. ఫార్మసీ రంగంలో అడుగు పెట్టింది. మందుల షాపులను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఫార్మసీ రంగంలో తన చిల్లర వర్తక కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. దీనికోసం నెట్మెడ్స్ ఫార్మసీ సంస్థలో భారీగా పెట్టుబడులను పెట్టింది. దీని విలువ 620 కోట్ల రూపాయలు.

నెట్మెడ్స్లో 60 శాతం వాటా..
నెట్మెడ్స్ బ్రాండ్ నేమ్గా కొనసాగుతోన్న వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ మూలధనంలో 60 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం నెట్మెడ్స్లో ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్, దధా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కూడా వాటితో జత కలిసింది. 620 కోట్ల రూపాయల పెట్టబడులతో 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. చెన్నైకి చెందిన దధా ఫార్మా కంపెనీ నెట్మెడ్స్ ప్రమోటర్గా వ్యవహరిస్తోంది.

డిజిటల్ యాక్సెస్.. మరింత సరళీకృతం
ప్రతి ఒక్కరికీ డిజిటల్ యాక్సెస్ను కల్పించడంలో భాగంగా తాము నెట్మెడ్స్లో పెట్టుబడులను పెట్టినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హెల్త్కేర్ రంగంలో అడుగు పెట్టడం సంతోషంగా ఉందని, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో వాటిని విక్రయిస్తామని పేర్కొన్నారు. టాప్ ఆన్లైన్ బిజినెస్ కంపెనీ అమేజాన్.. ఇ-ఫార్మసీలో అడుగు పెట్టింది. ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ యాజమాన్యం కూడా ఇ-ఫార్మసీలో ప్రవేశించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమేజాన్కు పోటీ?
అమేజాన్ ఫార్మసీ పేరుతో కొద్దిరోజుల కిందటే బెంగళూరులో ఆ సంస్థ ఇ-ఫార్మసీ ప్రాజెక్టును ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇ-ఫార్మా రంగానికి మంచి డిమాండ్ లభిస్తుండటంతో క్రమంగా దాదాపు అన్ని సంస్థలూ ఈ రంగంపై దృష్టి సారించాయి. ప్లిప్కార్ట్ కూడా త్వరలోనే ఇ-ఫార్మసీని ప్రారంభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెడ్లైఫ్లో పార్మాఈజీ కంపెనీ విలీనం అయ్యే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

రిలయన్స్ ఫ్యామిలీలో మేమూ
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉందంటూ నెట్మెడ్స్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రదీప్ దధా తెలిపారు. డిజిటల్, రిటైల్, టెక్ ప్లాట్ఫామ్స్ మరింత బలోపేతమౌతాయని, వినియోగదారుడికి మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడానికి వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పోటీ వాతావరణాన్ని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సామాన్యుడికి నాణ్యమైన హెల్త్కేర్ ఉత్పత్తులు అందుబాటు ధరల్లో విక్రయించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications