Ambani News: గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ నెట్ జీరో దిశగా కదలాలని భారత్ యోచిస్తోంది. దీంతో దేశీయ దిగ్గజ వ్యాపారవేత్తలు గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతున్నారు. వారిలో అంబానీ, అదానీలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే ఆదాని గ్రూప్ ఈ విభాగంలో వేల కోట్లు కుమ్మరించింది. ఇకపోతే అంబానీ తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే దిశగా భారీ ప్లాన్ కు తెర తీశారు.
గుజరాత్ లో ఏకంగా ఓ సోలార్ విలేజ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పుతోంది. ఈ ఏడాదిలోనే సోలార్ ప్లాంట్ సైతం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వేఫర్స్, పాలీ సిలికాన్, గ్లాస్, PV మాడ్యూల్స్, సెల్స్ వంటి పలు ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రణాళిక రచించింది. ఈ ప్లాంట్లో మొదటగా సెల్ ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది.

ఇప్పటికే తాము తయారు చేసిన సోలార్ ప్యానళ్లకు BIS సర్టిఫికెట్ లభించినట్లు పేర్కొంది. ఇతర రంగాలతో పోలిస్తే గ్రీన్ ఎనర్జీ విభాగం మరో ఐదేళ్లలో భారీ వృద్ధిని నమోదు చేయడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ని వృద్ధి పథంలో మరో స్థాయికి తీసుకెళ్లగలిగే సత్తా ఈ రంగానికి ఉందని ముఖేష్ అంబానీ బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలక్ట్రిఫైయర్లను తయారు చేసేందుకుగాను తమ కంపెనీ ప్రభుత్వ సహాయానికి అర్హత సాధించినట్లు రిలయన్స్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో గ్రీన్ ఎనర్జీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచడంతో పాటు వేలాదికోట్లను కుమ్మరిస్తోంది. గుజరాత్లోని జామ్ నగర్లో స్థాపించనున్న ఈ గిగా ప్లాంట్కు ధీరుభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ గా నామకరణం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తున్న 5 లక్షల కోట్లలో ఈ ప్రాజెక్ట్ ఒక భాగం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications