ముఖేష్ అంబానీ కీలక ప్రకటన, రిలయన్స్ బోర్డులోకి ఆరామ్‌కో యాసిర్

ముంబై: రిలయన్స్ బోర్డులోకి సౌదీ ఆరామ్‌కోను తీసుకుంటున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం (జూన్ 24) ప్రకటించారు. రిలయన్స్ వార్షిక సర్వసభ్య (AGM) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌదీ ఆరామ్‌కోను వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్నారు. ఆరామ్‌కో ప్రతినిధులను రిలయన్స్ బోర్డులోకి తీసుకోనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. అందరూ ఊహించిన విధంగా ముఖేష్ అంబానీ ఈ ప్రకటన చేశారు. రిలయన్స్ బోర్డు డైరెక్టర్‌గా సౌదీ ఆరామ్‌కోకు చెందిన యాసిర్ ఆల్‌రుమాయున్‌ను తీసుకున్నారు. యాసిర్ ఆల్‌రుమాయున్ సౌదీ ఆరామ్‌కో చైర్మన్ అలాగే, 430 బిలియన్ డాలర్ల సావరీన్ వెల్త్ ఫండ్ కింగ్‌డం గవర్నర్ కూడా.

ముఖేష్ అంబానీతో పాటు ఆయన సతీమణి నీతా అంబానీ పలు కీలక ప్రకటనలు చేశారు. జియో ఇనిస్టిట్యూట్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జియో ఇనిస్టిట్యూట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్న సేవా పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో రిలయన్స్ 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.

Reliance AGM 2021: Saudi Aramco Yasir al Rumayyan joins RIL board

ప్రస్తుతం మనం మానవతా సంక్షోభంలో ఉన్నామని, తమ ఉద్యోగులు, వాటాదారులు చాలామంది కరోనా క్లిష్ట సమయంలో కంపెనీ కోసం ఎంతో పని చేశారన్నారు. కరోనాపై పోరులో రిలయన్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రతి వంద మందిలో పది మందికి రిలయన్స్ ఆక్సిజన్ అందించినట్లు చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+