Reko Diq mine in Balochistan: పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి అనేక సహాయ ప్యాకేజీలు పొందినప్పటికీ దాని సంక్షోభం మాత్రం పోవడం లేదు.దేశ ద్రవ్యోల్బణం కనిష్ట వేతనంతో జీవించే పౌరులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీడీపీ వృద్ధిరేటు తగ్గుతోంది. అలాగే విదేశీ రుణ భారం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బలూచిస్తాన్లో ఉన్న రెకో డిక్ గని.. పాకిస్తాన్ను తిరిగి ఆర్థిక స్థిరత్వానికి తీసుకువచ్చే ఆయుధంగా మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జాంగ్ మీడియా గ్రూప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అరుదైన ఖనిజాలపై కూర్చుని ఉంది. రేపటి నుండి కాదు కానీ త్వరలోనే అవి దేశానికే కాదు ప్రాంతానికే ఎంతో కీలకమైన ఆర్థిక వనరులుగా మారుతాయి. రెకో డిక్ ద్వారా వచ్చే ఏడాది నుండి సంవత్సరానికి కనీసం 2 బిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తుందని తెలిపారు. చైనా వంటి దేశాలు ఇందులో భాగస్వామ్యం అయితే ఈ ఆదాయ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్క గని ద్వారా పాకిస్తాన్ ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలుస్తుందని జోస్యం చెప్పారు.

రెకో డిక్ ఏమిటి? బలూచిస్తాన్ రాష్ట్రంలోని చాగై జిల్లాలో ఉన్న ఈ గని.. ప్రపంచంలోని అతిపెద్ద రాగి-బంగారం ఖనిజ నిల్వలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని నిద్రాణ అగ్నిపర్వత ప్రాంతంలో ఉంది. రాయిటర్స్ ప్రకారం.. రెకో డిక్లో దాదాపు 590 కోట్ల టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఒక్కో టన్నులో సగటున 0.22 గ్రాముల బంగారం, 0.41% రాగి ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
తవ్వకాల చరిత్ర : ఈ గనిలో మొదటి తవ్వకాలు 1995లో ప్రారంభమయ్యాయి. మొదటి నాలుగు నెలల్లోనే 200 కిలోల బంగారం, 1,700 టన్నుల రాగి వెలికి తీసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2011లో పాకిస్తాన్ ప్రభుత్వం బారిక్ గోల్డ్ (Barrick Gold), ఆంటోఫాగాస్టా (Antofagasta) కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకుండా నిరాకరించడంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఈ గనిపై రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్ యాజమాన్యంలో 50 శాతం వాటా కనడాకి చెందిన బారిక్ గోల్డ్ చేతిలో ఉంది. మిగిలిన 50 శాతం పాకిస్తాన్ సమాఖ్య, బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వాల మధ్య విభజించబడి ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలదా : నిపుణులు చెబుతున్నదాని ప్రకారం.. రెకో డిక్లో వాణిజ్య స్థాయిలో మైనింగ్ ప్రారంభమైతే ప్రాధమిక దశలోనే సంవత్సరానికి 2 లక్షల టన్నుల రాగి, 2.5 లక్షల ఔన్సుల బంగారం ఉత్పత్తి కావచ్చు. ఇది పాకిస్తాన్కు బిలియన్ల డాలర్ల వృద్ధి అవకాశాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మెరుగయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. అంతేకాదు, విదేశీ పెట్టుబడిదారులకు స్థిరత్వం, పారదర్శక విధానాలు కనిపించాలి.. అలా కాకుంటే పూర్తి స్థాయిలో మైనింగ్ ప్రారంభం కావడం ఒక సవాలుగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) 2024లో రెకో డిక్ ప్రాజెక్ట్లో 15 శాతం వాటా కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపినట్టు నివేదికలు తెలిపాయి. దీంతో రాబోయే ఏడాదిలో ప్రాజెక్ట్పై కొత్త చర్యలు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications