F&O Trading: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల కోసం ట్రేడర్లు చేస్తున్న కొనుగోళ్లు ఒకపక్క కొనసాగుతుండగా.. మరో పక్క చాలా మంది ఇన్వెస్టర్లు ముందస్తు జాగ్రత్తలో భాగంగా పెట్టుబడుల అమ్మకాలకు దిగుతున్నారు.
మరో పక్క నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదనను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తిరస్కరించింది. వాస్తవానికి బ్రోకింగ్ కమ్యూనిటీ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ గంటలను పొడిగించాలన్న ఎన్ఎస్ఈ ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తాజాగా తిరస్కరించింది. వాస్తవానికి ఎన్ఎస్ఈ ప్రతిపాదనను పరిశీలిస్తే.. F&O కోసం ట్రేడింగ్ గంటలను క్రమంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని సెబీని కోరింది.

ట్రేడింగ్ గంటలను పొడిగించడం అనేది మార్కెట్ పార్టిసిపెంట్లు సాయంత్రం వేళలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తలపై చర్య తీసుకోవడానికి దశలవారీ ప్రణాళికలో భాగంగా ఉంది. రెండవ దశలో ట్రేడింగ్ను రాత్రి 11:30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. చివరిగా మూడో దశలో కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని సెబీకి ప్రతిపాదించారు. అదనపు ఖర్చులు, సాంకేతిక అవసరాల కారణంగా ట్రేడింగ్ గంటలను పొడిగించడానికి బ్రోకింగ్ సంఘం మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది ప్రారంభంలో స్టాక్ బ్రోకర్స్ బాడీ అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ప్రణాళికను ఆమోదించింది.
తమ ప్రతిపాదన సెబీ వద్ద తిరస్కరణకు గురైందని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ ఎన్ఎస్ఈ నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి వాయిదా వేయబడినట్లు పేర్కొన్నారు. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో NSE నికర లాభం అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఏకంగా 55 శాతం వృద్ధి చెందింది. ఇదే కాలంలో ఆదాయం రూ.4,625 కోట్లు పెరిగింది. దీంతో తన ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ ఒక్కో షేరుపై నాలుగు బోనస్ షేర్లతో పాటు మెుత్తంగా రూ.90 డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఎన్ఎస్ఈ ప్రతిపాదన సెబీ వద్ద తిరస్కరణకు గురైనట్లు వెల్లడికావటంతో స్టాక్ మార్కెట్లు క్షీణతకు గురయ్యాయి. దీనికి తోడు అనేక ఇతర కారణాలు సైతం మార్కెట్ల పతనాన్ని నడిపించాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications