రూ.99,122 కోట్లు ప్రభుత్వానికి బదలీ చేయనున్న ఆర్బీఐ, కరోనాపై పోరుకు ఉపయోగం

రూ.99,122 కోట్ల సర్‌ప్లస్‌ను ప్రభుత్వానికి బదలీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం ఆమోదం తెలిపింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోని తొమ్మిది నెలలు జూలై 2020-మార్చి 2021కి సంబంధించి వీటిని ట్రాన్సుఫర్ చేయాలని 589వ సమావేశంలో ఆర్బీఐ నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో ఆర్బీఐ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది. మే 21వ తేదీన ఈ సమావేశం జరిగింది. అలాగే కాంటింజెన్సీ రిస్క్‌ను 5.50 శాతంగా ఉంచాలని నిర్ణయించింది.

ప్రస్తుతం భారత్ కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి ఇది సవాల్‌గా మారింది. రాష్ట్రాల సహకారంతో దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది మోడీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ఇచ్చే ఈ సర్‌ప్లస్ నిధులు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే కరోనా లాక్ డౌన్, ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి.

RBI to transfer Rs 99,122 crore as surplus to government

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచ, దేశీయ సవాళ్లు, కరోనా సెకండ్ వేవ్ నేతృత్వంలో తీసుకున్న సవాళ్లను ఆర్బీఐ సమీక్షించింది. గత ఏడాది ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి కేవలం 44 శాతం సర్‌ప్లస్ లేదా రూ.57,128 కోట్లను బదలీ చేసింది. గత ఏడేళ్ల కాలంలో ఇదే కనిష్టం. అదే సమయంలో 2019లో రూ.1,23,414 కోట్లు బదలీ చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+