భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మేలో రూ. 2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నోట్లు తిరిగి ఇవ్వడానికి గడువు కూడా విధించింది. ఆ తర్వాత గడువును పొడిగించింది. నోట్లను బ్యాంకుల్లో ఇవ్వొచ్చని పేర్కొంది. తాజాగా రూ.2000 నోట్లను దేశంలోని ఏదైనా పోస్టాఫీసు ద్వారా ఈ కరెన్సీని డిపాజిట్ చేయవచ్చని తెలిపింది. ఈ నోట్ల ఉపసంహరణను మేలో సెంట్రల్ బ్యాంక్ మొదట ప్రకటించగా, ఆ తర్వాత డిపాజిట్, మార్పిడికి సంబంధించిన సౌకర్యాన్ని పొడిగించింది. రూ.2000 నోట్లలో 97 శాతానికి పైగా ఇప్పటికే తిరిగి ఆర్బీఐకి వచ్చాయి.
రూ. 2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి సంబంధించిన విండో తన 19 ఇష్యూ కార్యాలయాల్లో తెరిచి ఉందని ఆర్బిఐ పేర్కొంది. ఈ నోట్లను పంపడానికి ఇండియా పోస్ట్ అందించిన సేవలను ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించింది. డిపాజిట్లు లేదా మార్పిడి కోసం ఆర్బిఐ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదని పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చని పేర్కొంది. "రూ. 2,000 నోట్లను మార్చుకునే సదుపాయం మే 19, 2023 నుండి 19 రిజర్వ్ బ్యాంక్ (RBI ఇష్యూ కార్యాలయాలు) 1 వద్ద కూడా అందుబాటులో ఉంది. అక్టోబర్ 09, 2023 నుండి, RBI ఇష్యూ కార్యాలయాలు, అదనంగా రూ. 2,000 మార్చుకోవచ్చు. కౌంటర్లు అంతటా డినామినేషన్ బ్యాంక్ నోట్లు, వారి బ్యాంకు ఖాతాలకు డిపాజిట్ కోసం వ్యక్తులు / సంస్థల నుంచి రూ. 2,000 నోట్లను కూడా స్వీకరిస్తున్నారు" అని RBI తెలిపింది.

"ఇంకా దేశంలోని ప్రజలు భారతదేశంలోని తమ బ్యాంకు ఖాతాలకు క్రెడిట్ కోసం దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుంచి ఏదైనా RBI ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా రూ. 2,000 నోట్లను పంపవచ్చు. బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కోసం దరఖాస్తు ఫార్మాట్ జత చేయాలని" అని పేర్కొంది. మేలో ఉపసంహరణ ప్రకటించినప్పుడు చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లు, అక్టోబర్ 31, 2023 నాటికి రూ.0.10 లక్షల కోట్లకు (రూ. 10,000 కోట్లు) తగ్గింది.


Click it and Unblock the Notifications