ఆర్బీఐ రెపో రేటు పెంపుపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్య

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల కీలక రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుకు టైమ్ అలాంటిదన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని తెలిపారు. పరిస్థితులు అలాంటివని వ్యాఖ్యానించారు.

ఆర్బీఐ చర్య వల్ల ప్రభుత్వం తలపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ఉక్రెయిన్ పైన రష్యా చర్య తద్వారా పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావంతో ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో 2018 ఆగస్ట్ తర్వాత తొలిసారి ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

RBIs repo rate hike came as a surprise because: Nirmala Sitharaman

రెండు నెలలకు ఓసారి నిర్వహించే ఎంపీసీ పరపతి విధాన సమీక్ష సమావేశానికి ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం వెలువరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ మాట్లాడారు. ఆర్బీఐ నిర్ణయం అనూహ్యమైనది కావొచ్చునని, ప్రజలు ఊహించనిదైతే కాదన్నారు. రెండు ఎంపీసీల భేటీల మధ్య ఈ నిర్ణయం వెలువడటం ఒక్కటే అనూహ్యమైనదన్నారు. పెంపు గురించి ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ఎప్పటి నుండో చెబుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+