RBI Monetary Policy: వరుసగా పదోసారి వడ్డీ రేటు స్థిరంగా, 4% వద్ద కొనసాగింపు

వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మానిటరీ పాలసీ కమిటీ(MPC) నిర్ణయించింది. 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన ముగిసింది మానిటరీ పాలసీ. నేడు (10, ఫిబ్రవరి) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ MPC సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రెపో రేటును 4 శాతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వరుసగా పదోసారి రెపో రేటును స్థిరంగా కొనసాగించారు.

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇచ్చాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేశాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచనుంది. ఇదే దిశలో ఆర్బీఐ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయా లేదా కనీసం సంకేతాలు ఇస్తుందా అనే చర్చ సాగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నారు.

RBI Monetary Policy: Repo rate unchanged at 4 percent for tenth consecutive time

కీలక వడ్డీ రేట్లు మరిన్ని నెలల పాటు యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వేలో కూడా వెల్లడైంది. కరోనా నుండి కోలుకుంటున్న భారత్ పైన ఒమిక్రాన్ ప్రభావం చూపింది. అయితే ఆర్థిక కార్యకలాపాలు మరీ అంతగా పతనం కాలేదు. ద్రవ్యోల్భణం కూడా భారీగా పెరుగుతోంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్భణం కాస్త అదుపులో ఉందని చెబుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ ప్రభావం మనపై పడుతుంది. ఇది ద్రవ్యోల్భణ పెరుగుదలకు దారితీస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+