వడ్డీరేట్లు యథాతథం, ఆర్థిక మందగమనానికి అనేక మార్గాలు: RBI
ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సమీక్షలో రెపో రేటును యథాతథంగా (5.15 శాతం) ఉంచింది. రివర్స్ రెపో రేటును కూడా మార్చకుండా 4.90 శాతం వద్దే ఉంచింది. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలనే అంశంపై మానిటరీ పాలసీ కమిటీ 6-0 ఓట్లతో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
ఏపీ నుండి ప్లాంట్ తరలింపు నిజమా? కియా మోటార్స్ ఏంచెబుతోంది?
2019-20 ఆర్థిక సంవత్సరంలో చివరి క్వార్టర్లో రిటైల్ ద్రవ్యోల్భణం 6.5 శాతంగా ఉంటుందని, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో 5.4 న నుండి 5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అక్టోబర్-డిసెంబర్ 2020లో ఇది 6.2 శాతంగా అంచనా వేసింది.
వృద్ధి రేటును పట్టాలెక్కించేందుకు వడ్డీ రేటు ఒక్కటే పరిష్కారం కాదని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వృద్ధిని పట్టాలెక్కించేందుకు ఆర్బీఐకి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు.
2021-20 బడ్జెట్ తర్వాత జరిగిన తొలి ద్రవ్య, పరపతి విధాన సమీక్ష ఇది. గత డిసెంబర్ నెలలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్భణం అయిదేళ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి జూన్ సమీక్షలోను ఎలాంటి వడ్డీ రేట్ల కోత ఉండదని భావిస్తున్నారు. 2019లో ఆర్బీఐ మొత్తంగా 135 బేసిస్ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లను తగ్గించింది.