2022లో ఆర్బీఐ వడ్డీ రేట్లు మూడుసార్లు పెంచవచ్చు: HDFC సీఈవో అంచనా

ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకు సీఈవో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల పెంపుపై స్పందించారు. ఈ ఏడాది రెపో రేటు రెండు లేదా మూడుసార్లు తప్పక పెరిగే అవకాశాలు ఉన్నాయని HDFC వైస్ చైర్మన్, సీఈవో కేకీ మిస్త్రీ అంచనా వేశారు. వచ్చే ద్ర్య సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేటు విషయంలో ఆర్బీఐ తీరును తప్పుబట్టలేమన్నారు.

వాస్తవానికి ఉపాధి కల్పన, ప్రజల ఆదాయం పెరుగుదలకు, వినియోగ సామర్థ్యం పుంజుకోవడానికి ఆర్థిక వ్యవస్థలో ప్రగతి అనేది దేశానికి చాలా ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో వడ్డీరేట్లు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమేమీ ఉండదని చెప్పారు. ద్రవ్యోల్బణం విషయంలో భారత్-అమెరికా మధ్య పోలిక వద్దని చెప్పారు. అమెరికాలో ఎప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువేనని, భారత్‌లో తక్కువే అన్నారు. అమెరికాలో 8.5 శాతానికి పైగా ఉంటే, భారత్‌లో 5.7 శాతం వద్దే ఉందని చెప్పారు.

RBI may consider raising interest rates in 2022: HDFC CEO

ఆర్థిక పునరుద్ధరణకు ముందు వడ్డీ రేట్లను పెంచడం వృద్ధిని దెబ్బతీస్తుందని ఆర్బీఐకీ తెలుసునని చెప్పారు. తన నలభై ఏళ్ల అనుభవంలో హౌసింగ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు ఈ స్థాయికి తగ్గడం చూడలేదన్నారు. ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెరగకపోయినప్పటికీ 2022లో మాత్రం వడ్డీ రేట్లను మూడుసార్లు పెంచవచ్చునని చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+