RBI Digital Rupee: వినియోగదారులకు RBI గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై మీరు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే పేమెంట్స్ చేయవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన కొత్త ఆవిష్కరణ అయిన ఆఫ్లైన్ డిజిటల్ రూపాయి (e₹)ను అధికారికంగా ప్రారంభించింది. ఈ సౌకర్యం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇంటర్నెట్ లేకుండా కూడా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలో అత్యంత డిజిటల్ కరెన్సీ ఫ్రెండ్లీ దేశాలలో ఒకటిగా నిలబెట్టబోతోంది.
డిజిటల్ రూపాయి అంటే ఏమిటి?: డిజిటల్ రూపాయి (e₹) అనేది భారత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC). అంటే ఇది సాధారణ రూపాయి యొక్క డిజిటల్ వెర్షన్. RBI ద్వారా నేరుగా జారీ చేయబడుతుంది. ఈ డబ్బు సాధారణ బ్యాంకు ఖాతాలో కాకుండా, RBI అనుమతించిన డిజిటల్ వాలెట్ లో నిల్వ చేయబడుతుంది. వినియోగదారులు ఈ వాలెట్ ద్వారా తక్షణ డబ్బు బదిలీలు, వ్యక్తి నుండి వ్యక్తికి (P2P) చెల్లింపులు, వ్యాపారాలకు QR కోడ్ ద్వారా పేమెంట్లు చేయగలరు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా లేకుండానే e₹ ఉపయోగించవచ్చు. ఇది ఆర్థిక చేరికను మరింత విస్తరించడంలో సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది.

డిజిటల్ రూపాయి వాలెట్ అందిస్తున్న బ్యాంకులు: ప్రస్తుతం 15 ప్రధాన బ్యాంకులు RBI యొక్క రిటైల్ CBDC పైలట్ ప్రాజెక్ట్ లో భాగమై ఉన్నాయి. వీటిలో SBI, ICICI, HDFC, యస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, PNB, ఫెడరల్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటివి ఉన్నాయి.
వినియోగదారులు ఈ బ్యాంకుల e₹ యాప్లను Google Play Store లేదా Apple App Store నుండి డౌన్లోడ్ చేసుకుని సులభంగా నమోదు చేసుకోవచ్చు.లాగిన్ అయిన తరువాత చెల్లింపులు నెట్ లేకుండా జరపవచ్చు. వాలెట్లకు ఏ రకమైన ఛార్జీలు లేదా వడ్డీ ఉండదు. అలాగే మొబైల్ పోయినా వాలెట్ను తిరిగి పొందవచ్చు.
ఆఫ్లైన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?: e₹ ఆఫ్లైన్ ఫీచర్ ప్రధానంగా గ్రామీణ, తక్కువ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల కోసం రూపొందించబడింది. ఇది రెండు ప్రధాన విధానాలలో పనిచేస్తుంది:
1. టెలికాం ఆధారిత ఆఫ్లైన్ చెల్లింపులు: చాలా తక్కువ సిగ్నల్ ఉన్నా కూడా పని చేస్తాయి.
2. NFC ఆధారిత ట్యాప్ చెల్లింపులు: ఇంటర్నెట్ లేకపోయినా రెండు ఫోన్ల మధ్య ట్యాప్ టు పే పద్ధతిలో లావాదేవీలు జరుగుతాయి.
ఈ ఫీచర్తో ఇంటర్నెట్ లేకుండా కూడా రియల్ టైమ్ చెల్లింపులు సాధ్యమవుతాయి. ఇది డిజిటల్ కరెన్సీకి ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. e₹ కేవలం డిజిటల్ మనీ మాత్రమే కాదు. ఇది ప్రోగ్రామబుల్ కరెన్సీ. అంటే, ప్రభుత్వం లేదా సంస్థలు నిధులను ప్రత్యేక ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించేలా పరిమితం చేయవచ్చు.
ఉదాహరణకు:
గుజరాత్ G-SAFAL పథకం: రైతుల కోసం వ్యవసాయ ఇన్పుట్లకే పరిమిత e₹.
ఆంధ్రప్రదేశ్ దీపం 2.0 పథకం: LPG సబ్సిడీ కోసం మాత్రమే ఉపయోగించే e₹.
ఇది భవిష్యత్తులో కార్పొరేట్ పేమెంట్లు, టార్గెట్ రుణాలు మరియు ప్రభుత్వ సబ్సిడీ పంపిణీలలో ముఖ్యపాత్ర పోషించనుంది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) వల్ల భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమ ఫిన్టెక్ దేశంగా ఎదిగిందన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ రూపాయి ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం అందిస్తుందని, ముఖ్యంగా ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇది డిజిటల్ క్యాష్ అనుభవాన్ని అందిస్తుందని అన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications