RBI నుంచి కీలక ప్రకటన..రెపో రేటును యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్.. GDP వృద్ధి అంచనా 6.7%కు పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (MPC) ఆగస్టు 2026 సమీక్షా సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన అనంతరం కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ఆగస్టు 3 నుండి 5 వరకు జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించడానికి మద్దతు తెలిపారు.

దీనితో పాటు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూనే ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు 'తటస్థ' (Neutral) ద్రవ్య విధాన వైఖరినే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇతర కీలక రేట్లైన స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్) రేటును 5 శాతంగా.. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటును 5.5 శాతంగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

RBI MPC RBI Policy Repo Rate Repo Rate 5 25 RBI Governor Sanjay Malhotra GDP Growth Forecast RBI August 2026 Monetary Policy Committee Interest Rates Indian Economy Inflation RBI News Stock Market Banking News Business News MPC 5 25 2026

ద్రవ్యోల్బణ పరిస్థితులపై మాట్లాడిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆహార, ఇంధన ధరలలో హెచ్చుతగ్గుల వల్ల ఆర్‌బిఐ నిర్దేశిత పరిమితిని మించి పెరిగినప్పటికీ, ప్రధానమైన కోర్ ద్రవ్యోల్బణం మాత్రం అదుపులోనే ఉండటం ఊరటనిచ్చే అంశమని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3) ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది.

Also Read

పశ్చిమ ఆసియాలో చెలరేగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల జూలై నెల నుంచి ఇంధన ధరల్లో కొంత అస్థిరత కనిపించినప్పటికీ.. భవిష్యత్ విధాన మార్పులకు శ్రీకారం చుట్టే ముందు ద్రవ్యోల్బణ ధోరణి మరియు దాని భాగాలపై మరిన్ని ఆర్థిక గణాంకాల ఆధారంగా పూర్తి స్పష్టత కోరుకుంటున్నట్లు చెప్పారు. మొత్తం 2026-27 (FY27) ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటుందని, త్రైమాసికాల వారీగా Q2 లో 4.7 శాతం, Q3 లో 5.9 శాతం మరియు Q4 లో 5.5 శాతంగా నమోదు కావచ్చునని ఆర్‌బిఐ అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విధానాల్లో సవాళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అత్యంత స్థిరంగా, బలంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ముఖ్యంగా తయారీ రంగంలో కార్పొరేట్ ఫలితాలు అద్భుతంగా రాణించడమే కాకుండా, విచక్షణతో కూడిన ఖర్చులు మరియు ప్రైవేట్ వినియోగం ఊహించిన దానికంటే మెరుగ్గా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చింది. ఈ సానుకూల పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, ఆర్‌బిఐ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జిడిపి (GDP) వృద్ధి అంచనాను మునుపటి 6.6 శాతం నుండి 6.7 శాతానికి పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రైమాసికాల వారీగా జిడిపి వృద్ధి అంచనాలను పరిశీలిస్తే-మొదటి త్రైమాసికంలో (Q1) 7.0 శాతం, రెండవ త్రైమాసికంలో (Q2) 6.4 శాతం, మూడవ త్రైమాసికంలో (Q3) 6.5 శాతం మరియు నాల్గవ త్రైమాసికంలో (Q4) 6.8 శాతంగా వృద్ధి నమోదు కావచ్చునని ఆర్బీఐ పేర్కొంది. సవాళ్లను అధిగమిస్తూ స్థిరమైన ప్రగతి బాటలో పయనిస్తున్న దేశీయ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసేలా, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరే వరకు రాబోయే రోజుల్లో కూడా ఆర్‌బిఐ తగిన జాగ్రత్తలతో కూడిన నిర్ణయాలనే తీసుకుంటుందని గవర్నర్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+