RBI: మణప్పురం ఫైనాన్స్ కు షాకిచ్చిన ఆర్బీఐ.. రూ.20 లక్షల జరిమానా విధింపు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మణప్పురం ఫైనాన్స్ కు షాకిచ్చింది. మణప్పురం ఫైనాన్స్ కు భారీ జరిమానా విధించింది. ప్రజలకు రుణాలు అందించేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ జరిమానా విధించింది. గోల్డ్ లోన్ కంపెనీకి రెగ్యులేటరీ సమ్మతి లోపాల కారణంగా మణప్పురం ఫైనాన్స్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 లక్షల జరిమానా విధించింది.
NBFC నిబంధనలలోని కొన్ని నిబంధనలను పాటించనందుకు RBI రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఎలాంటి లావాదేవీలను ప్రభావితం చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 2021లో మణుప్పురం ఫైనాన్స్ తనిఖీని నిర్వహించింది. దీని తర్వాత కంపెనీ స్థితిగతులపై పూర్తి నివేదికను రూపొందించి ఆదేశాలు ఇచ్చారు.

ఈ తనిఖీలో కంపెనీ నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీని కారణంగా సెంట్రల్ బ్యాంక్ కంపెనీపై జరిమానా విధించింది. అదే సమయంలో, 90 రోజులకు పైగా బకాయి ఉన్న గోల్డ్ లోన్ ఖాతాను వేరు చేయాలని కంపెనీకి ఆర్బీఐ స్పష్టం చేసింది.2011 నుంచి కొన్ని ఖాతాలలోని మొత్తానికి తప్పనిసరి రుణ నిర్వహణను కూడా కంపెనీ నిర్ధారించలేదని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
దీనితో పాటు, రిజర్వ్ బ్యాంక్ అనేక ఇతర సమస్యలను గుర్తించింది. దీనిపై కంపెనీ సరైన సమధానం ఇవ్వకపోడవంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బిఐ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక పరిస్థితిని, నిబంధనల ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో ఏదైనా సమస్యను గుర్తిస్తే, జరిమానా లేదా నిషేధానికి సంబంధించిన చర్య తీసుకునే అధికారం ఆర్బీఐకి ఉంది.


Click it and Unblock the Notifications