ప్రైవేట్ బ్యాంకులకు RBI గవర్నర్ హెచ్చరిక.. NPAల విషయంలో అలా చేయవద్దని సూచన
RBI: ప్రేవేట్ బ్యాంకుల బోర్డుల్లోని ఉన్నతాధికారులు, డైరెక్టర్లతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. కొన్ని సునిశిత వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల బ్యాంకింగ్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, పలు హెచ్చరికలు జారీ చేశారు.
ఆయా బ్యాంకుల వద్ద కార్పొరేట్ గవర్నెన్స్ లో లోపాలు కనిపించాయని RBI గవర్నర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం పట్ల కఠినంగా వ్యవహరించాలని, NPAలను దాచేందుకు ప్రయత్నించవద్దని ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులు, డైరెక్టర్లను హెచ్చరించారు. ఇందుకు సంబంధించి శక్తికాంత దాస్ చేసిన ప్రసంగం RBI అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయబడింది.

"కార్పోరేట్ గవర్నెన్స్పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో కొంత అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకుల పాలనలో మేము అంతరాలను గుర్తించాము. ఇది ఆందోళన కలిగించే విషయం" అని RBI గవర్నర్ తెలిపారు. ఒత్తిడికి గురైన ఖాతాల వాస్తవ స్థితిని బ్యాంకులు దాచిపెట్టే వినూత్న మార్గాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడతాయని ప్రశ్నించారు.
రుణాల బైబ్యాక్ ద్వారా ఇద్దరు రుణదాతలను ఒకరికొకరు ఎవర్ గ్రీన్గా మార్చడం, ఒత్తిడికి గురైన రుణగ్రహీతతో నిర్మాణాత్మక ఒప్పందాలను కుదర్చడం, రుణగ్రహీత తిరిగి చెల్లింపును సర్దుబాటు చేయడానికి అంతర్గత ఖాతాలను ఉపయోగించడం, ఒత్తిడిలో ఉన్న రుణగ్రహీతకు మునుపటి రుణాల చెల్లింపు తేదీకి దగ్గరవుతుండగా కొత్త/అదనపు రుణాల పంపిణీ వంటి చర్యలు సబబు కాదని శక్తికాంత దాస్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications


