Shaktikanta Das: అమెరికా యూరప్ లలోని బ్యాంకింగ్ సంక్షోభం దావానలంగా మారే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే కుప్పకూలిన శ్రీలంక.. అదే దారిలో ఉన్న పాకిస్థాన్ వంటి దేశాలు ప్రపంచానికి పెద్ద సవాళ్లను తీసుకురానున్నాయి. ఈ క్రమంలో భారత రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సూచనలు చేశారు.
దేశీయ బ్యాంకులు తమ మూలధనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టమైన సంకేతాలు పంపారు. దీనికి తోడు సెంట్రల్ బ్యాంక్ బ్యాంకుల వ్యాపార నమూనాలను మరింత నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది. అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం తర్వాత ప్రజలు సైతం బ్యాంకుల బలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలోని సంక్షోభం అలజడి రేపుతోందని తెలుస్తోంది. బ్యాంకులు, రెగ్యులేటర్లు రిస్క్ అసెస్మెంట్లో వైఫల్యం పూర్తి స్థాయి బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీసిన అమెరికా, యూరోపియన్ ఎపిసోడ్ల నుంచి RBI తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే భారతీయ బ్యాంకులు చాలా జాగ్రత్తగా రిజర్వు బ్యాంక్ ఆధ్వర్యంలో నియంత్రించబడుతున్నాయని తెలుస్తోంది.
యెస్ బ్యాంక్, DHFL, IL&FS పరిణామాల తర్వాత దేశంలోని బ్యాంకుల పనితీరును వాటి పెట్టుబడులు, రుణ పోర్ట్ ఫోలను రిజర్వు బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతం కాకుండా చూసేందుకు ఎన్పీఏలను తగ్గించేందుకు దేశంలోని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో నాణ్యత, చట్టబద్ధమైన బ్రాంచ్ ఆడిట్ల కవరేజీని కూడా ఆర్బిఐ తాజాగా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో చెడు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని శక్తికాంత దాస్ దేశంలోని బ్యాంకులకు సూచించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications