UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీ.. ఎవరు భరిస్తారు..!
యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను అనుమతిస్తే, ఆ భారాన్ని ఎవరు మోస్తారో ఇప్పుడే నిర్ణయించడం తొందరపాటు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులు ఉచితంగా ఉండాలో నిర్ణయించే విషయంలో కేంద్రానికి మరింత విచక్షణాధికారాన్ని కల్పించే 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026'ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఒక రోజు తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇప్పుడే దీని గురించి మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుంది. ఆ ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సిందే" అని అన్నారు.
చివరికి వినియోగదారులు ఈ భారాన్ని మోయాల్సి వస్తుందా అని అడగ్గా.. ఆ ఖర్చు ప్రత్యేక లావాదేవీ రుసుముగా కనిపించనప్పటికీ, వినియోగదారులు ఇప్పటికే చెల్లింపు మౌలిక సదుపాయాల కోసం ఏదో ఒక రూపంలో చెల్లిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఒక నిర్దిష్ట చెల్లింపు చేసే వ్యక్తి కాకుండా, ఆ భారాన్ని ప్రభుత్వం, వ్యాపారాలు లేదా విస్తృత ఆర్థిక వ్యవస్థ భరించవచ్చని ఆయన చెప్పారు. చెల్లింపు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు కొనసాగించడం, ఆ ఖర్చులకు నిధులు ఎలా సమకూర్చాలో నిర్ణయించడమే తమ ప్రాధాన్యతని మల్హోత్రా వివరించారు.

వినియోగదారులకు, వ్యాపారులకు లేదా ఏ కేటగిరీ యూపీఐ లావాదేవీలపైనా ఎలాంటి ఛార్జీని ప్రకటించలేదు. ఈ బిల్లులో యూపీఐ గురించి ప్రస్తావించలేదు, ఎండిఆర్ రేటును నిర్దేశించలేదు, లేదా రూ. 2,000 పరిమితిని నిర్ణయించలేదని అన్నారు. సాధారణంగా ఎండిఆర్ అనేది ఒక డిజిటల్ లావాదేవీని ప్రాసెస్ చేసే బ్యాంకుకు లేదా చెల్లింపు సేవా సంస్థకు వ్యాపారి చెల్లించే రుసుము. నిర్వచనం ప్రకారం ఇది చెల్లింపు చేసే వినియోగదారుడిపై నేరుగా విధించే ఛార్జీ కాదని పేర్కొన్నారు. వ్యాపారాలకు చేసే రూ. 2,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.5 శాతం కంటే తక్కువ ఎండిఆర్ను కేంద్రం అనుమతించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే బదిలీకి ఛార్జ్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, కేంద్రం జనవరి 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్-కార్డ్ లావాదేవీలపై ఎండీఆర్ ను సున్నా చేసింది. తదనంతరం, కొన్ని తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీలకు గాను, పాల్గొనే బ్యాంకులు, చెల్లింపు కంపెనీలకు నష్టపరిహారం అందించడానికి ఒక ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆగస్టు 2025 నాటికి కూడా ఎటువంటి లావాదేవీ ఛార్జీ విధించే ఆలోచనలో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీఐపై ఛార్జీలు విధించే ప్రతిపాదన ఏదీ లేదని ఆ సమయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications